ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడుపుకోవాలి పోత్కపల్లి ఎస్ఐ దికొండ రమేష్ జనం గొంతు /ఓదెల/ సతీష్ కుమార్ పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు మీకోసం లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు.. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఈరోజు పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు మీకోసం కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు 18 సంవత్సరాలు పైబడిన వాళ్లే ఆటో నడపాలని నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడపాలన్నారు. 1)ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలి 2)మద్యం తాగి ఆటో నడపరాదు 3)ఆటో పేపర్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి 4)ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదు 5)రోడ్లమీద ఆటోలో నిల్ప రాదు. 6) ఆటోలో అనుమాన వ్యక్తులు ప్రయాణం చేసిన యెడల పోలీసులకు తెలియజేయాలి 7) ఆటోలో మ్యూజిక్ సిస్టం పెట్టరాదు 8) మహిళల ప్రయాణికుల పట్ల వృద్దుల పట్ల గౌరవం చూపెట్టాలి, 9) పోలీసు స్టేషను లో ప్రతి ఒక్క ఆటోకు టాప్ నెంబర్ ను . తప్పకుండా ఆటో యజమానులు తమ ఆటోలకు టాప్ నెంబర్ ను వేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించి ఆటోలు నడిపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది పోత్కపల్లి ఎస్ఐ రమేష్ గారు తెలిపారు. అనంతరం వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న డ్రైవర్ ఆనంద్ ను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు..