స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల.. స్నేహమేరా జీవితానికి నీడ నిచ్చే మల్లేరా.. ఆపదలోను, ఆప్యాయతలోనూ అడుగడుగునా అండ నిలిచేది స్నేహం ఒకటే,ఆస్తి పాస్తులు ఎన్ని వున్నా స్నేహం ఒకటే మిన్నరా..అంటూ రాయికల్ పట్టణంలోని స్థానిక విశ్వశాంతి పాఠశాలలో విద్యార్థులు ముందస్తు స్నేహితుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు స్నేహబంధం ముందు ఏ కులమతం అడ్డు లేదనీ,స్నేహం ఒకటే మేలంటు, అన్నిటిలోన తోడు నీడగా సోదర భావం తో అండగా ఉంటానని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపు కున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ సమాజంలో,బంధుత్వంలో స్నేహానికి గొప్ప విలువ ఉన్నదని,మన మంచి కోరే స్నేహం మనల్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా అండగా ఉంటుందని,అలాగే చెడు వ్యసనాలకు బానిసైన స్నేహం వ్యక్తిని సమాజంలో అవినీతిపరుడుగా దేశద్రోహిగా తయారయ్యేలా చేస్తుందని, విద్యార్థులు చెడు స్నేహాన్ని వదిలిపెట్టి,మంచి స్నేహాన్ని ఆస్వాదించి ఒకరికొకరు అండగా నిలిచి సమాజానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత,విద్యాన్వేష్ మరియు ఉపాధ్యాయులు రంజిత్ ,మహేష్ సంజన ,శృతి ,మనీషా పాల్గొన్నారు.