*ఒక పత్రిక 10 వేల సైన్యం తో సమానం... *వాదాల పేరుతో వాస్తవాలు మరుగున పడుతున్నాయి.. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జి... 1948 లో ప్రారంభమై 77 ఏళ్ళుగా వెలుబడుతున్న ఏకైక జాతీయవాద పత్రిక, గర్వించదగిన తెలుగు వార పత్రిక జాగృతి అని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జితెలిపారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వార పత్రిక జాగృతి పాఠకుల ఆత్మీయ సమ్మేళనము బుధవారం రోజున సాయంత్రం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా గల రెవెన్యూ గార్డెన్స్ లో జరిగింది. ఇట్టి ప్రోగ్రాం కు ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలుగు పత్రికల చరిత్ర నిస్సందేహంగా ఘనమైందన్నారు. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో పత్రికలు ప్రముఖపాత్రనుపోషించాయన్నారు. ఆ రోజుల్లో ఆంధ్ర పత్రిక, కృష్ణ పత్రిక, ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ఆంధ్రప్రభ లాంటి ఎన్నో పత్రికలు ఉండేవని , ఆ తర్వాత ఈనాడు , ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు వచ్చాయన్నారు. నేడు మీడియా రంగం ఎంతో విస్తరించిందన్నారు. డిజిటల్ , సోషల్ మీడియా తో వేగంగా సమాచార వ్యాప్తి జరిగే పరిస్థితులు వచ్చాయన్నారు. ఒక పత్రికపదివేలసైన్యంతోసమానమన్నారు. కానీ నేడు వాదాల పేరుతో వాస్తవాలు మరుగున పడిపోతున్నాయన్నారు. భారతీయత మీద వక్ర భాష్యాల విషపుజల్లులుకురుస్తున్నాయన్నారు. ఏ పత్రిక అయినా సదాశయంతోనే ప్రారంభమవుతుందని, అర్థవంతమైన పేరు , ఆదర్శనీయమైన ప్రయాణం రెండు కన్నులుగా సాగిన పత్రికల జాడ చరిత్ర లో ఒకింత తక్కువేనన్నారు. జాతీయ భావజాలం తో, ధర్మం, రక్షణ కోసం ఈ మట్టి పరిమళంతో వేలుబడుతు , ఎన్నో అటు పోట్లను ఎదుర్కొని 77 ఏళ్లుగా నిలబడిన ఏకైక వార పత్రిక జాగృతి యే నన్నారు. ప్రధానంగా జాతీయతకు సుదూరంగా ఉండే ప్రభుత్వాల ఏలు బడిలో కత్తి సాము చేసిన ఘనత జాగృతి దే న్నారు. జాగృతి ముఖ్యంగా జాతీయ భావాజాలను వ్యాప్తం చేసిందని, ప్రజల అవసరాలను గుర్తించి, ఎన్నో రచనలు చేసి సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నాలు చేసిందన్నారు. గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా జాగృతి స్వరాజ్య సమరయోధుల పోరాట ఆశయాన్ని ఆవిష్కరించడానీకే శ్రమిస్తుందన్నారు. ఇలాంటి పత్రికను మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రజలతో మమేకమవుతూ సమాజం కోసం పలువిధాలపాటుపడుతుందన్నారు.. నేడు దేశంలోని సామాజిక రంగాల్లో ప్రవేశించి, ఒక జాతీయ శక్తిగా సంఘం ఎదిగిందన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బాధ్యులు కట్ట రాజగోపాల్, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి. దురిశెట్టి నిరంజన చారి , పాక సత్యనారాయణ, ఎలగందుల సత్యనారాయణ, కిషన్ జి, బాలరాజు , తడగోప్పు ల శంకరయ్య, గీకూరి శ్రీనివాస్ , మహేశ్వర్ , పుల్లూరి రామారావు , మురళీజీ , పరుశరాం జి తదితరులు పాల్గొన్నారు.
Comments 0