బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులు అవామీ లీగ్ మద్ధతుదారులుగా ఉంటూ వస్తున్నారు. దీంతో అల్లరి మూకల వాళ్లను టార్గెట్ చేసాయి. అంతేకాదు అవామీ లీగ్ మద్దతు దారుల హిందూ నేతల ఇళ్లతో పాటు హిందువులను టార్గెట్ చేస్తూ అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. అంతేకాదు అక్కడ ఉన్న పలు చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పలు దేవాయాలను ధ్వంసం చేస్తున్నారు. హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు, దోపిడిలు,దేవాలయ విద్యంసాలను తీవ్రంగా ఖండిస్తూ శనివారం సాయంత్రం రాయికల్ మండలం రామోజీపేట్ గ్రామం లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుండి హనుమాన్ గుడి వరకు అన్ని పార్టీలకు అతీతంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం డాక్టర్ బిఆర్ అంబేత్కర్ విగ్రహం ముందు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలుపుతు మరణిచిన హిందువులకు 2నిమిషాలు మౌనం పాటించారు.
Comments 0