కనగర్తి గ్రామంలోని స్థానిక దాసరి పద్మ హనుమయ్య జిల్లా పరిషత్తు పాఠశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓదెల మండల ప్రత్యేక అధికారి శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించాలని, నాటిన మొక్కలు అన్నిటిని కూడా సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత పాఠశాలలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను పరిశీలించి, పాఠశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడినారు. ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి.. పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓదెల ఎంపీడీవో తిరుపతి గారు, ఎంపీ ఓ భాస్కర్ గారు, ఏపీఎం లతా మంగేశ్వరి గారు ,పంచాయతీ కార్యదర్శి ముత్యాల సందీప్ గారు, ప్రధానోపాధ్యాయులు ఎర్ర రమేష్ గారు ,ఇన్చార్జ్ ఏపీవో శ్వేత గారు, టెక్నికల్ అసిస్టెంట్ జనార్ధన్ గారు, పి టి విష్ణు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ పట్టణంలో గత 150 సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతున్న చరిత్రక భీమన్న రథోత్సవం ఘనంగా జరిగింది ముందుగా ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి రథం ముందుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ నిర్వహకుల పూజారులు అనంతరం రథోత్సవాన్ని జరిపించారు దావతోల్లు మేక పిల్లల్ని గావు పట్టగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ దావ వసంత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పోరండ్ల గ్రామం నుండి కోడలుగా వచ్చిన భీమక్క అనే మహిళ భీమేశ్వరుని ప్రతిష్టించగా జాతర చిన్నగా ప్రారంభమై ఇప్పుడు జిల్లా కేంద్రంలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచింది దాదాపు లక్షకు పైగా భక్తులు జాతరకు వచ్చినట్లు ఒక అంచనా ఉంది చిన్న పిల్లల కేరింతల మధ్య బొమ్మల తినుబండారాల దుకాణాలు, జాయింట్ వీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో సురక్షిత త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దేవుని నర్సయ్య,రాజం,లింగయ్య, చిన్నరాజం,రాజన్న,రెడ్డి,రాజేందర్,కునారపు భుమేష్,శేఖర్ రాజు,లక్ష్మన్,హరీష్, పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.