బాధ్యతాయత జర్నలిజం నేటి అవసరం * రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ * డబ్ల్యూజేఐ పంచాంగం ఆవిష్కరణ హైదరాబాద్: విలువలు, వాస్తవాలతో కూడిన బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రస్తుత సమాజానికి అవసరమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. జర్నలిజం ప్రమాణాలను కాపాడేందుకు వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ప్రతినిధులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అయన పేర్కొన్నారు. డబ్ల్యూజేఐ రూపొందించిన విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆదివారం ఉదయం రాజ్ భవన్ లో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పంచాంగాన్ని డబ్ల్యూజేఐ ప్రచురిండాన్ని ఆయన అభినందించారు. ఈ తరహా ప్రయత్నాలు సాంప్రదాయాలను సజీవంగా ఉంచడంలో, వాటిని నూతన తరం సులభంగా అర్థం చేసుకునేలా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు, ప్రజలకు గవర్నర్ తెలుగు వత్సర శుభాభినందనలు తెలిపారు. * జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి * వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన పంచాంగాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ హైదరాబాద్ సిటీ కార్యాలయంలో విడుదల చేశారు. పంచాంగాన్ని అందంగా ముద్రించిన డబ్ల్యూ జే ఐ ని అభినందించారు. ఈ సంవత్సరంలో డబ్ల్యూ జే ఐ చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలుగు జర్నలిజంలో డబ్ల్యూ జే ఐ ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలని ... దేశహితానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనతికాలంలోనే తెలంగాణలో డబ్ల్యూ జే ఐ వేగంగా పురోగమించడం శుభ పరిణామమన్నారు...ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.తెలిపారు. పంచాంగం/దైనందిని ఆవిష్కరణ కార్యక్రమాల్లో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర సలహాదారుడు శ్రీ మురళీమనోహర్, గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా , ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.
Comments 0