దేశ ప్రధానిగా 2014లో బాధ్యతలు చేపట్టిన అనంతరం మనదేశం చాలా ప్రశాంతంగా మారింది. ప్రపంచ దేశాలు సైతం భారత ఔన్యత్యాన్ని గుర్తించేలా..భారత్ అంటే శక్తిమంతమైన దేశమని గుర్తించేలా ప్రధాని మోదీ చేసారంటూ బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్ బాగుండేలా..పేదల సంక్షేమం జరిగేలా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు విజయ సంకల్ప యాత్రలు చేస్తున్నామని తెలిపారు. భాగ్యలక్ష్మి క్లస్టర్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని హైదరాబాద్ వారాసిగూడలో విజయ సంకల్ప యాత్ర సందర్భంగా మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో దాదాపు 80 కోట్లకు మందికి ఉచిత రేషన్ అందిస్తున్న ఘనత మోదీ దేనన్నారు. దేశంలో ప్రతి మహిళకు వంట గ్యాస్ అందిస్తూ .. మరో ఐదేళ్ల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయబోతున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు గుర్తు చేశారు. సీఎంగా పని చేసినా.. పదేండ్లుగా ప్రధానిగా బాధ్యతలు నెరవేరుస్తున్నా.. మోదీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి జరగినట్లు ఆరోపణ ఎదువరలేదన్నారు. అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలనను అందిస్తున్న నరేంద్ర మోదీని పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి విజయంతో ఆశీర్వదిద్దామని చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో 2జీ, బొగ్గు స్కాముల్లో రూ. 12 లక్షల కోట్లను కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేసిందని కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ దోపిడీని భరించలేకే .. అవినీతి రహిత పాలకుడు కావాలని మోదీని ప్రజలు ఎన్నుకున్నట్లు గుర్తు చేశారు. సికింద్రాబాద్, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొనసాగిన ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్... అభివృద్ధికి నిలయం బీజేపీ అని.. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. కాకతీయ భద్రకాళి క్లస్టర్-1 వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలోని హనుమకొండలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా రాకేష్ రెడ్డి పాల్గొన్న సందర్భంగా.. అవినీతి కాంగ్రెస్ కు ఓటేస్తే దేశం మళ్లీ ముక్కలవుతుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీపై యుద్ధం చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని.. అలా యుద్ధం చేస్తా అన్న ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలే ఇంట్లో కూర్చున్నారని అన్నారు. రేవంత్ తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడాలని సూచిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందని రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ యాత్ర వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్దన్నపేట నియోజకవర్గాల మీదుగా కొనసాగింది. కాకతీయ భద్రకాళీ క్లస్లర్-2 భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని జనగాం నియోజకవర్గంలో జరిగిన విజయసంకల్ప యాత్రలో ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి నారాయణ స్వామి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ యాత్రలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కన్నీళ్లు, దుఖం:, ఆకలి విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే దేశంలో పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. పేదల సొంతింటి కల నెరవేర్చేలా 4 కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు. తెలంగాణలో బాగుపడింది కేవలం కేసీఆర్ గారి కుటుంబం మాత్రమేనని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కు కుటుంబ సభ్యులు మాత్రమే ముఖ్యమని దుయ్యబట్టారు. 140 కోట్ల ప్రజలే అభ్యున్నతే ముఖ్యమని భావించే గొప్ప నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ అని వివరించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేసుకునేలా ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ ప్రజలను కోరారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా తొమ్మిది లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేసిందని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని, అందుకు నిదర్శనమే కామారెడ్డి నియోజకవర్గమని కొనియాడారు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన ఘన చరిత్ర కామారెడ్డిదేనన్నారు. రాజరాజేశ్వరి క్లస్టర్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో విజయసంకల్ప యాత్ర కొనసాగింది. కామారెడ్డి జిల్లా గాంధారి లో వికసిత్ భారత సంకల్ప రోడ్ షోలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్-బీఆర్ఎస్ అవినీతిపై మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులో జరిగిన అవినీతి విషయంలో విచారణ జరపకుండా.. కేవలం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికే గత బీఆర్ఎస్ సర్కారు తెలంగాణను లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో మభ్యపెడుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే రూ. 2 లక్షల కోట్లు అవసరమని... అందుకే నిధులు ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి నరంద్ర మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమని.. జహీరాబాద్ ప్రజలు బీజేపీ ఎంపీ అభ్యర్థికి తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు. నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న విజయసంకల్ప యాత్రలకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ అన్నారు. ముఖ్యంగా కాకతీయ భద్రకాళి క్లస్టర్ లో వరంగల్ లో యాత్ర నేటితో ముగియనుండగా.. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నారాయణ స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా కృష్ణమ్మ క్లస్టర్ లో నిర్వహించనున్న విజయసంకల్ప యాత్ర ఇవాళ్టితో ముగియనుందని ప్రదీప్ కుమార్ తెలిపారు. కృష్ణమ్మ క్లస్టర్ ముగింపు యాత్రకు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ ముఖ్యఅతిథిగా హాజరై.. రోడ్ షోలో పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచి, కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటులో తెలంగాణ ప్రజలను భాగస్వామ్యం చేసే సంకల్పంతో చేపట్టిన బీజేపీ విజయసంకల్ప యాత్రలకు విశేష స్పందన లభించింది. బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గారి సారథ్యంలో, రాష్ట్ర కీలకనేతల పర్యవేక్షణలో .. బిజెపి జాతీయ నేతలు, బిజెపి ముఖ్యమంత్రుల పర్యటనలతో పార్టీలో జోష్ వచ్చింది. కార్నర్ మీటింగులు, రోడ్ షోలు, బహిరంగ సభలతో బీజేపీ ముఖ్య నాయకులు ఇంటింటికీ బీజేపీ సందేశం..వాడవాడకూ కాషాయ పతాకం అంటూ నినదిస్తూ, ప్రధాని మోదీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను జాగృతం చేశారు. ఈ సందర్భంగా... గత 11 రోజులుగా బీజేపీ విజయసంకల్ప యాత్రకు పెద్దఎత్తున తరలివచ్చి, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన బీజేపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు అందరికీ యాత్ర ప్రముఖ్ దుగ్యాల ప్రదీప్ కుమార్ గారు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అలాగే రేపటి రోజున (02-03-2024) నిర్వహించనున్న విజయసంకల్ప యాత్ర ముగింపు సభలను ప్రజలు విజయవంతం చేయాలని ప్రదీప్ కుమార్ పిలుపునిచ్చారు