రాయికల్ పట్టణంలోని లక్ష్మి గార్డెన్ లో గ్రీన్ వుడ్ హై స్కూల్ అన్యువల్ డే మరియు వీడ్కోలు వేడుకను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తాహాసిల్దర్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యాం మాట్లాడుతు.. విభిన్నమైన విలువలతో కూడిన విద్య విధానం అవలంభిస్తు విద్యార్థులలో విద్యతో పాటు సామాజిక ,సాంఘిక ,సాంసృతిక ,ఆధ్యాత్మిక దేశం పట్ల భక్తి,భాధ్యత లతో విలువలను నేర్పుతూ విద్యార్థులకు క్రమ శిక్షణ తో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్ బంగారు బాటలు వేస్తున్న గ్రీన్ వుడ్ హై స్కూల్ యాజమాన్యం విద్యా విధానం అభినందనీయం అని అన్నారు. పట్టణ పురపాలక సంఘం చైర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతు పాఠశాల స్థాయి విద్యానే విద్యార్థులకు కీలకం అని చిన్నప్పటిని నుండి తల్లి తండ్రులు విద్యార్థులను శ్రద్దతో చదివి పించుకోవాలని ,మా అమ్మ నన్ను క్రమశిక్షణతో జీవితం అంటే ఏమిటో నేర్పింది అని నన్ను కష్ట పాడి చదివించడం వలన నేను లెక్చరర్ గా అనేక విద్యార్థులను జీవితాలను బంగారు మాయం చేశామని ,నా పిల్లలను ఇద్దరు డాక్టర్ లను ఒకరిని వ్యాపారవేత్తను చేశానాని ఇప్పుడు రాయికల్ పట్టణానికి చైర్మన్ ముందు మాట్లాడే అవకాశం లభించడం ఆనాడు మా అమ్మ చదివు చెప్పించడం వలననే అని అన్నారు తెలుగుకు ఆంగ్ల పాఠశాలలో ప్రాధాన్యత ఇవ్వాలి ప్రెవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యాతో పాటు తెలుగు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని భవిష్యత్ తారలతో తెలుగు అంతరించే అవకాశం ఉందని ఆంగ్ల మధ్యమ పాఠశాలలో తెలుగు భాషకు కూడ నేర్చాలని వైస్ చైర్మన్ రాయికల్ పురపాలక సంఘం గండ్ర రమాదేవి సూచించారు . ఈ కార్యక్రమంలో ఎంపిపి లావుడ్య సంధ్యారాణి , జెడ్పి టిసి అశ్విని జాదవ్, ప్రెస్ క్లబ్ జే ఏ సి అధ్యక్షులు వాసరి రవి, ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్ ,ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్ ,పాఠశాల కరస్పాండెంట్ మిట్ట పెల్లి మహేష్ , హెడ్మాస్టర్ సారాలా రాజేష్, డైరెక్టర్ కాకెర శ్రీనివాస్ ,ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.