• బి ఆర్ ఎస్ ద్వారానే ప్రజా సంక్షేమం • బి ఆర్ ఎస్ పార్టీలో చేరికల సునామి • కారు జోరుకు బేజారు అవుతున్న హస్తం • పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్, అక్టోబర్ 30 (జనం గొంతు) : కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి ఓటు వేస్తే మోసపోయి గోసపడతామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని నాలుగవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెగడ పరుష రాములు శ్యామల ఆడెపు అంబదాసు లు తిరిగి సొంతగూటికి చేరుకున్నారు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 సంవత్సరాల కాలంలో చేయని అభివృద్ధిని కేవలం 9 సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపారని అన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీలే కాకుండా అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు ఒంటరి మహిళ వృద్ధులు వికలాంగులు వితంతులు బోదకాలు నేత గీత కార్మికుల కు పెన్షన్లు అందించడమే కాకుండా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నిరంతరం విద్యుత్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందని రానున్న రోజులలో తిరిగి కారు గుర్తుపై ఓటు వేసి బి.ఆర్.ఎస్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు గత పాలకులు చేయనటువంటి అభివృద్ధి చేసి చూపమని రానున్న రోజులలో మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని మీ అందరి సహాయ సహకారాలు అందించి తిరిగి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ కౌన్సిలర్లు పారుపల్లి జ్ఞానేశ్వరి గుణపతి కూకట్ల గోపి తిరుపతి గొట్టం లక్ష్మి మాజీ జెడ్పిటిసి ఐల రమేష్ పాల రామారావు కొండ సత్యనారాయణ బండి సంపత్ గౌడ్ సురా శ్యామ్ తిప్పారపు దయాకర్ రాజోజుల శివ పల్ల సురేష్ అపర్ణ చిన్ని నాని వాహీద్ రఫిక్ వేణి శెట్టి రాము లతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు పలువురు పాల్గొన్నారు.
Comments 0