అడవులు, వన్యప్రాణుల పరిరక్షణలో అటవీ సిబ్బంది సేవలు అమూల్యం - డిఎఫ్ఓ సిహెచ్ బాలమణి భూమాతపై నెలకొన్న సహజ ప్రకృతి వనరులను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా అటవీ సిబ్బంది రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా కాపలా కాయడం జరుగుతున్నట్లు కరీంనగర్/సిరిసిల్ల జిల్లాల డిఎఫ్ఓ సిహెచ్ బాలమణి అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఫారెస్టు ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో కలప స్మగ్లర్లు, వన్యప్రాణులు, అటవీ భూమి దురాక్రమణదారుల నుండి దాడులు జరగడం, ప్రాణాలు సహితం అర్పించడం కొనసాగుతున్నట్లు ఆవేదన వ్యక్తుల చేశారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా ట్రేనీ కలెక్టర్ అజయ్ మాట్లాడుతూ నేడు అడవులను రక్షించుకుంటేనే రేపటి తరానికి, సకల జీవకోటికి ఆరోగ్యకరమైన పర్యావరణం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ అధ్యక్షులు, లయన్స్ క్లబ్ ఆ ఫ్ మంకమ్మతోట జిల్లా చైర్మన్లు లయన్ జి లక్ష్మయ్య, లయన్ పి శేఖర్లు మాట్లాడుతూ అమరులైన అటవీ సిబ్బంది కుటుంబాలకు బాసటగా నిలుస్తామని, వాతావరణ ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న అటవీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రాణ త్యాగం చేసిన అటవీ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా సభ్యులు ఎం మహేందర్, పి సురెందర్లతో పాటు మంకమ్మతోట లయన్స్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారిగా పాటు ఇతర లయన్ సభ్యులు, రేంజ్ ఆఫీసర్స్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తూ ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులకు అటవీ శాఖ, లీడ్ ఇండియా, మంకమ్మతోట లయన్స్ ఘనంగా సన్మానించారు. ఫోటో: అటవీ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానిస్తున్న పౌర సమాజం
Comments 0