జనంగొంతు//డెస్క్//భారత వాయు దళానికి చెందిన అత్యంత ప్రతిభావంతులైన నలుగురు గగన వ్యోమగాములును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపిక చేసారు. వీరి ఎంపిక తో భారత అంతరిక్ష వ్యవస్థ రాబోయే పది సంవత్సరాల లో ఐదు రెట్లు పెరిగి 40 బిలియన్ డాలర్ల కు చేరుతుందని తెలిపారు. కాగా వీరు 2021 లో రష్యాలో పూర్తి శిక్షణ పొంది అన్ని రకాల పరీక్షలు ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యులకు భారత దేశం యొక్క అభ్యున్నతి కీర్తి ప్రతిష్టల దృష్ట్యా గోప్యత పాటించాలని కోరారు. ఎంపికైన వారిలో గ్రూప్ కెప్టెన్ లు ప్రశాంత్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుబాంశు శుక్లా లు ఉన్నారు.