రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాయికల్ పట్టణానికి చెందిన గట్టుపెళ్లి రాంబాబు చికిత్స కోసం 1996-97 పదవ తరగతి స్నేహితులు రూ.1లక్ష 500 ఆర్థిక సాయాన్ని గురువారం కుటుంబ సభ్యులకు అందించారు.తోటి మిత్రుడు త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆర్థిక సాయం అందించిన పదవ తరగతి పూర్వ విద్యార్థులకు రాంబాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచ్చ శేఖర్, రాచర్ల ఆంజనేయులు,సిలివేరి సురేష్, భూమి మహేష్,సాంబారు శ్రీనివాస్,బెజ్జంకి హరికృష్ణ, కడార్ల శ్రీనివాస్,మండ రమేష్,వాసం శివకుమార్,పురెల్లి శ్రీనివాస్,రాజేశం,బసవరాజు,శ్రీపతి సత్తయ్య,మారంపల్లి రమేష్,బండి రామకృష్ణ, మ్యాకల నరేష్,మచ్చ కృష్ణ,పడాల రమేష్, పిన్నం శెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments 0