ఈరోజు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళా మోర్చా సమావేశం సిటీ కార్యాలయం బర్కత్పురాల్లో జరిగింది. ఈ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్చ్ 5వ తారీఖున సాయంత్రం 4:30 గంటల నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో జరుగునున్న ఏక్ భారత్ సారి వాకతాన్ కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ జరిగింది . మహిళలు ఎన్నో రంగాల్లో కృషి చేస్తున్నారు ఆ కృషిని అందరూ గుర్తించి వారి పనితనాన్ని అభినందించాలనే ఉద్దేశంతో కూడుకున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం థిమ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వాకతాన్ నిర్వహిస్తున్నారని తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు డా. పద్మా వీరపనేని, రాష్ట్ర నాయకురాలు, కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షురాలు మరియు వారి ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.