హైదరాబాద్ లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరియు రాష్ట్ర మంత్రివర్గంతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.అనంతరం కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించితే దాన్ని అమలు చేసే విషయంలో బాబు జగ్జివన్ రామ్ గారు ముఖ్య భూమికను పోషించారని,వర్గీకరణ విశయంలో కుడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నారని,అదే విధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అసైన్డ్ కమిటీ ద్వారా నిరుపేద ప్రజలకు మిగులు భూములను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు,దళితులకు న్యాయం చేకూర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలిపారు
Comments 0