* ఇరిగేషన్, మైనింగ్ శాఖకు రూ.50కోట్ల జరిమానా.. * అవినీతిపరులకు వంతపాడిన అధికారులను వదలం.. * NGT తీర్పుని స్వాగతిస్తున్నాం..... * బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి గారు... పెద్దపల్లి,మే 22(జనం గొంతు): అధికారమధంతో మానేరువాగు నుండి ఇసుక అక్రమ ఇసుక తవ్వకాలు జరిపి వేలకోట్లు దోచుకున్న గత అధికార, ప్రతిపక్ష నాయకులకు చెన్నయ్ హరిత ట్రిబ్యూనల్ న్యాయస్థానం వెలువరించిన తీర్పు చెంపపెట్టులాంటిదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి ఇసుక మానిటరింగ్ కమిటీకి వ్యతిరేఖంగా హరిత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపధ్యంలో బుధవారం సురేష్ రెడ్డి ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా మానేరువాగు వెంబడి 19ఇసుక రీచులకు సంబంధిత అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమ తవ్వకాలు జరపడం పట్ల కోర్టు ఆగ్రహించిందని వివరించారు. అవినీతికి బాద్యులను చేస్తూ ఇరిగేషన్, మైనింగ్ శాఖలుకు రూ.50కోట్ల జరిమానా విధించినదని, అట్టి డబ్బులను మూడునెలల్లో గోదావరి రివర్ మేనేజిమెంటు ఖాతాలో జమచేయాల్సిందిగా న్యాయస్థానం తీర్పు వెలువరించిదన్నారు. చేతివృత్తులు చేసుకునే వారికి మాత్రమే పర్యావరణ శాఖ నుండి అనుమతులు అవసరముండదనే విషయాన్ని కోర్టు స్పష్టంగా తెలియపరిచిందని సురేష్ రెడ్డి అన్నారు.జిల్లాలో అన్ని రీచులను వెంటనే మూసివేయాలని, అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను కోరారు. గత ప్రభుత్వం చేసిన ఇసుక మాఫియాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా వాటా ఉందని, అవినీతిపరులకు అండగా ఉన్న అధికారలు వదిలిపెట్టబోమని సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడేళ్ళుగా ప్రాణాలకు తెగించి తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచిన రైతులు, ప్రజలు, అభిమానులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేషంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు, మాజీ సర్పంచ్ కట్కూరి సత్యనారాయణ రెడ్డి, పార్లమెంట్ దళిత మోర్చా కోకన్వీనర్ ఈర్ల శంకర్, అమరగాని శ్రీనివాస్ యాదవ్, కందుల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.