రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ పట్టణంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 2023 - 24 విద్యా సంవత్సరం యొక్క వార్షిక క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా రాయికల్ తహశీల్దార్ ఖయ్యూం జాతీయ క్రీడా కారుడు గణేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేస్తూ అతిధి కి ఆహ్వానం పలికారు. అనంతరం ఒలంపిక్ క్రీడాజ్యోతి వెలిగించి స్పోర్ట్స్ ఫ్లాగ్ ఎగరవేయడం జరిగింది. అనంతరం హీలియం గాలితో నింపిన త్రివర్ణ పతాకం రంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలి ఆటలను ప్రారంభించారు. ఇందులో భాగంగా జాతీయ అథ్లెటిక్స్ లో ఎంపికైన గణేష్ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జె తిరుపతిరావు, ప్రిన్సిపాల్ జె వేణుగోపాలరావు, MRO విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరియు పోషకులు పాల్గొన్నారు.