వేసవి ని దృష్టిలో ఉంచుకుని మంచి నీటి ఎద్దడిని నివారణకు చర్యలు వెంటనే చేపట్టాలి.. భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ * జనం గొంతు / కోదాడ :రానున్న వేసవి ని దృష్టిలో ఉంచుకుని మంచి నీటి ఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ శుక్రవారంఒక ప్రకటన లో ప్రభుత్వాన్ని కోరారు.ఈ సవంత్సరం లో తీవ్రమైన ఎండలు ఉండబోతున్నాయి అని సంబంధిత అధికారులే ముందస్తు హెచ్చికలు చేస్తున్నారని, కాని నీటి ఎద్దడి కి తీసుకుంటున్న చర్యలు ఏమిటో ఇప్పటివరకు ప్రభుత్వం నుండీ ఏలాంటి ప్రకటనలు రాకపోవడం శోచనీయం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కరువు, కాటకాలు మరియు నీటి ఎద్దడికి ప్రత్యేక నిధులు కేటాయింపులు చేయక పోతే ఎలా అని ప్రశ్నించారు.సూర్యాపేట జిల్లాలో ఇప్పటి కే కొన్ని దళిత,గిరిజన ప్రాంతాల్లో మంచి నీళ్ళ కొరకు వ్యవసాయ బోరు బావులు దగ్గర నీళ్ళ కోసం బారులు తీస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.గత బిఆర్ ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కొరకు వేల కోట్ల రూపాయలు కేటాయించారని దానిపై వందలాది మంది కార్మికులు పని చేస్తున్నపటికి అన్నిగ్రామాలకు త్రాగునీరు అందడంలేదన్నారు.జిల్లాలో, మండలలో వచ్చే మిషన్ భగీరథ నీటి సరఫరా కు పాలేరు నీటి నిల్వలు పడి పోవడం వల్ల మండలం లో మిషన్ భగీరథ నీటి సరఫరా లో ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉందన్నారు.సూర్యాపేట జిల్లా కలెక్టర్ నీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని కోరారు...
Comments 0