అంగన్వాడీ సెంటర్ లో అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని రాయికల్ మండలము భూపతిపూర్ అంగన్వాడి సెంటర్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపిడిఓ చిరంజీవి మాట్లాడుతూ పిల్లల సంఖ్య ను అంగన్వాడీ లో పెంచే విధంగా కృషిచేయాలని సూచించారు.పిల్లలకి పోషకాలతో కూడిన సమతుల్య ఆహరం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ ,సెక్రటరీ హరికృష్ణ, సూపర్వైజర్ రాధ,అంగన్వాడీ టీచర్స్,కవిత,సుమలత ,సుగుణ ,ఆశా వర్కర్లు, వివోలు పాల్గొన్నారు
Comments 0