విద్యార్థిని అభినందించిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇటీవల వేములవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో మల్యాల ఆల్ఫోర్స్ స్కూల్ కి చెందిన కె. అశ్వద్దామా అండర్ - 14 ఇయర్స్ కుమితే ( ఫైట్ ) విభాగం లో పాల్గొని విశేష ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ తో పాటు ఓవర్ ఆల్ గ్రాండ్ ఛాంపియన్ షిప్ సాధించారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కటా , కుమితే ( ఫైట్ ) సబ్ - జూనియర్, జూనియర్, క్యాడేట్, సీనియర్ బాలుర విభాగాల్లో పాల్గొన్న ఆల్ఫోర్స్ క్రీడాకారులు శ్రీజ , స్నేహర్షిత, రిషిక,మేధశ్రీ, శ్రీనిధి, సహర్ష్, శ్రీచరణ్, అక్షిత్, అఖిలేష్ ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి పలు పథకాలు సాధించినట్టు వివరించారు. పథకాలు సాధించిన విద్యార్థులనుద్దెశించి మాట్లాడుతూ కరాటే నేర్చుకోవటం ద్వారా ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థైర్యం పెంపొందుతుందనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలు ఆత్మరక్షణ విద్య అయిన కరాటే ను తప్పకుండ నేర్చికోవాలన్నారు ఈ సందర్బంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ స్కూల్ ప్రిన్సిపాల్, కరాటే మాస్టర్ ఎం. శ్రీనివాస్,అధ్యాపక బృందం,తదితరులు పాల్గొన్నారు.
Comments 0