రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టి ఊపు మీదున్న కాంగ్రెస్ లోకి చేరికల ప్రవాహం కొనసాగుతుంది చేరికలను ఆహ్వానించాలని హస్తం పార్టీ నాయకత్వం నిర్ణయించటంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు మరియు భూపాలపల్లి మండలం సెగ్గంపల్లి బొగ్గు కంటా లోడింగ్ ఆన్ లోడింగ్ కార్మికులు సుమారు 300 మంది సోమవారం *భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు, జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, యూత్ నాయకులు, మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.