సుల్తానాబాద్,మే 4(జనం గొంతు ): సుల్తానాబాద్ పట్టణ కేంద్రం గాంధీనగర్ లో నేహా పాఠశాలను శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల నుంచి ఉపాధ్యాయులు మెరుగైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలన్నారు.పాఠశాల యాజమాన్యం స్వప్న సంతోష్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి మినుపాల స్వరూప ప్రకాష్, మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్మన్ బిరుదు సమత కృష్ణ, కౌన్సిలర్ దున్నపోతుల రాజయ్య, కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్,చిలుక సతీష్,కుమార్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments 0