ఈరోజు హైదరాబాదులో నేషనల్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేషనల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ గా నర్రి స్వామి కురుమ ను నియమించినట్లు నేషనల్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి మరియు ఎన్నో సామాజిక సంస్థలకు అనేక ఉద్యమ సంఘాల నిర్మాణాలకు కిలక పాత్ర పోషించిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ గారిని పార్టీ నేషనల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ గా నియమించుకోవడం చాలా సంతోషకరమన్నారు ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి,ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మేము చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు మరియు అనేక లీగల్ అంశాలపై పోరాటాలు నిర్వహిస్తున్న సందర్భంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీధర్ గారు నేషనల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ గా నియమిస్తూ నియమాక పత్రాన్ని అందజేసి సన్మానం చేయడం చాలా సంతోషకరం నేషనల్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పంచ సూత్రాలు గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించే వరకు హైకోర్టు సుప్రీంకోర్టులో వాళ్లు పార్టీ చేసే లీగల్ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు, తెలంగాణ నాయకులు, ఉదయలక్ష్మి,విజయలక్ష్మి, వాసుదేవరావు , నామాని భాస్కర్, అంజలి దేవి , సమత , దుర్గా కళ్యాణ్ అనేకమంది నాయకులు పాల్గొన్నారు
Comments 0