రాయికల్ పట్టణంలోని హనుమాన్ ఆలయానికి మరియు కొత్తపేట,సింగరావుపేట గ్రామా ఆలయాలకు 10 లక్షల చొప్పున నిధుల మంజూరుకి కృషి చేసిన బీఆరెస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుని రాయికల్ పట్టణ ,మండల ప్రజల పక్షాన ఘనంగా సన్మానించుకోవటం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్, మాజీ జడ్పీ చైర్మన్ ద్యావ వసంత సురేష్,రాయికల్ పట్టణ అధ్యక్షులు ఎలిగేటి అనిల్ కుమార్, కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,మహేష్ గౌడ్,సాయికుమార్,మహేంధర్,సత్యనారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ ఉదయశ్రీ,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మల్లేష్,మహిళా అధ్యక్షురాలు స్పందన సాగర్ రావు,రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments 0