రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి మైతాపూర్ గ్రామ శివారులో ప్రస్తుతం గీస్తున్న ఈత వనాన్ని రాయికల్ కు చెందిన ఓ వ్యక్తి కావాలనే నిప్పంటించి దగ్ధం కావటానికి కారకుడు అయ్యారని మైతాపూర్ గ్రామ గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు జగిత్యాల ఎక్సయిజ్ సి.ఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు బత్తి మహేష్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన వ్యక్తి భూమిలో ఉన్న ఈతవనాన్ని గీస్తూ జీవనోపాధి పొందుతున్నామని గత మూడు రోజుల క్రితం రాయికల్ కు చెందిన బైరి రాజశేఖర్ అకారణంగా ఈతవనాన్ని దగ్ధం చేయడంతో పాటు గత 3 రోజుల క్రితం నిచ్చెనలు, ఈత కుండలను ధ్వంసం చేశాడని చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటూ తమకు న్యాయం చేయాలని కోరారు.
Comments 0