గురువారం సాయంత్రం 4.00 గంటలకు జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్, IPS గారి ఆదేశాల మేరకు , జగిత్యాల డీఎస్పీ శ్రీ రఘు చందర్ గారి పర్యవేక్షణ లో, రూరల్ సిఐ శ్రీ ఆరిఫ్ అలీ ఖాన్ గారు మరియు రాయికల్ ఎస్సై అజయ్ మరియు వారి సిబ్బంది రాయికల్ శివారు లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు CCL, A-1 కొండూరి రాజేష్ మరియు A-2అరుముల్ల సాయి లు స్కూటీ పైన రాయికల్ వైపు జగిత్యాల నుండి వస్తుండగా, కుమ్మరిపల్లి బస్టాండ్ వద్ద వారిని పట్టుకొని విచారించగా వారి వద్ద గల సంచి లో 1.5 కిలోల ఎండు గంజాయి ఉన్నది. నిందుతుల వద్ద నుండి గంజాయి, సెల్ ఫోన్ లు మరియు స్కూటి ని స్వాధీన పరచుకొని విచారించగా వారు చేసిన నేరం ఒప్పుకున్నారని ప్రెస్ మీట్ లో తెలియజేశారు.