రామగుండం ట్రాఫిక్ సబ్-ఇన్స్పెక్టర్ G. హరిశేఖర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురు వ్యక్తులను సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్, గోదావరిఖని శ్రీ వెంకటేష్ దుర్వ గారి ముందు హాజరుపరచారు. ఇందులో ముగ్గురికి రూ.6,000/- జరిమానా విధించగా, రెండవసారి నేరానికి పాల్పడిన ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. శిక్ష విధించబడిన వ్యక్తిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.