మల్యాల మండలం తక్కల్లపల్లి గ్రామం లో సోమవారం మహేశ్ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు . పూర్తి వివరాలోకి వెళ్తే మహేష్ అనే యువకుడు యువతి కోసం ఇంటికి వెళ్ళగా కుటుంబ సభ్యులు చూసి అడ్డుకోడవం తో మహేష్ కోపంతో తన దగ్గర ఉన్న కత్తి తో దాడి చేయడంతో యువతి తల్లి,తాత కి గాయల పాలయ్యారు. దీంతో యువతీ కుంటుంబ సభ్యులు వచ్చి యువకుడి పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మల్యాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన నాగెల్లి సురేష్(24) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తల పై బలమైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసి, వ్యవసాయ బావిలో పడవేశారు. మృతుని తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తూ సంఘటనా స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ గారు, రూరల్ సిఐ ఆరిఫ్ అలీ ఖాన్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ బృందం తో నేర స్థలం పరిశీలించారు మృతుని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Your experience on this site will be improved by allowing cookies.