రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాపూజీ తెలంగాణ ఉద్యమం, స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించి ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని ఆయన స్మరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.