|
modi add 1

కేసిఆర్ తెలంగాణ ను మోసం చేసి మొసలి కన్నీరు పెడుతుండు. సిఎం రేవంత్ రెడ్డి.

క్రిష్ణ గోదావరి పరివాహక ప్రాంత నీటి ప్రాజెక్టుల విషయంలో గత ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేనంతగా మోసం చేసాడని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రిష్ణ గోదావరి పరివాహక ప్రాంతం ప్రాజెక్టు లు కేంద్ర ప్రభుత్వం తన ఆదీనంలోకి తీసుకునేందుకు అన్ని రకాల ఆమోదాలు అందించి ఇప్పుడేమో అది తమ ప్రభుత్వమే కేంద్రానికి ఇచ్చేస్తుందని అబద్దాల ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. దానికి అనుగుణంగా ఆయన ముఖ్యమంత్రి గా సంతకం చేసిన పత్రాలను సమావేశంలో ప్రదర్శించారు. క్రిష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లో కేంద్ర మంత్రి చైర్మన్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి లు సబ్యులు గా ఉంటారని . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి అలాగే విభజన అనంతరం ప్రాజెక్టుల అనుమతి కేంద్ర జలవనరుల అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. క్రిష్ణ నదీ పరివాహక ప్రాంత నీటిలోని 811 టీఎంసీల లలో 68% నీటి వాటాకు తెలంగాణ అనుమతి ఉండగా కేవలం 299 టిఎంసి లకు మాత్రమే ఒప్పుకొని సంతకాలు చేసారని పత్రాలను చూపించారు. అలాగే రాయలసీమ కు నీటి సరఫరా కోసం జీవో నెంబర్ 203 పేరుతో రోజుకు 8 టిఎంసి లో నీటిని తోడుకునేందుకు దొడ్డిదారిన 05/05/2020 న మెగా క్రిష్ణ రెడ్డికి అనుమతులిచ్చారని. అదే సమయంలో కేంద్రం జలశక్తి సమావేశాలను టెండర్లు పూర్తయ్యే వరకు నాటకీయంగా వాయిదా వేస్తూవచ్చారని తెలిపారు. నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సస్యశ్యామలం చేసే ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు ను నిర్లక్ష్యం చేసి. 92500 కోట్ల ఖర్చు ఏడాదికి 10 వేల కోట్ల నిర్వహణ ఖర్చు చేయించే కాలేశ్వరం ప్రాజెక్టు ను కట్టాడని విమర్శించారు. ఇంత చేసినా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీరు అందించలేదని తెలిపారు. తమ ప్రభుత్వం ఏమాత్రం తెలంగాణ కు అన్యాయం చేసే ఇటువంటి చీకటి ఒప్పందాలకు పూనుకోదని. అలాగే తెలంగాణ కు నీటి వాటా అంశాల్లో సమాన వాటా దక్కే వరకు కేంద్ర జలవనరుల శాఖ కు ప్రాజెక్టుల ను అప్పగించేసింది లేదని ఖరాఖండిగా చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు ను ఆంద్రపోలీసులు ఆక్రమించుకుంటే కనీస స్పందన లేని దద్దమ్మ కేసీఆర్ అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ పాల్గొన్నారు.

By Miryala Pranay | February 04, 2024 | 2 Comments

Hot Categories

2
1
6
1