రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల జగిత్యాల రెండవ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు గ్రామీణ ఆర్థిక పరిస్థితులు విశ్లేషణపై కోర్సులో భాగంగా ప్రాంతీయ పరిశోధనా స్థానం దత్త గ్రామమైన అల్లీపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ప్రధాన పంటల గూర్చి రైతుల సాగు ఖర్చులు గూర్చి విద్యార్థులు సమాచారం సేకరించారు అలాగే అల్లీపూర్ రైతు ఉత్పాదక సంస్థలో (ఎఫ్ ఇ ఒ) లో వయ్యారిభామ కలుపు మొక్కల వల్ల జరిగే నష్టాలు గూర్చి శాస్త్రవేత్తలు డాక్టర్ డి ఏ రజనీ దేవి, డాక్టర్ రవి మృతిక శాస్త్రవేత్త వివరించారు పరిసర ప్రాంతాల్లో ఉన్న వయ్యారిభామ కలుపు మొక్కలను విద్యార్థులు తొలగించారు. ఈ కార్యక్రమంలో దత్తత గ్రామ ఇన్చార్జ్ డి ఏ రజనీదేవి, మృతిక ,శాస్త్రవేత్త డాక్టర్ రవి, అగ్రి హబ్ రూరల్ కోఆర్డినేటర్ టి రంజిత్ కుమార్ ఎఫ్ఈఓ అధ్యక్షుడు అత్తినేని శంకర్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.