అయోధ్య శ్రీరామచంద్రుడి దర్శనార్థం వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం హైదరాబాద్, అయోధ్య మధ్యలో డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించాలని ఫిబ్రవరి 26వ తేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారికి లేఖ రాశాను. వారు వెంటనే స్పందించి.. రెండు నగరాల మధ్య విమానాల రాకపోకల కోసం వాణిజ్య విమాన సంస్థలతో (కమర్షియల్ ఎయిర్‌లైన్స్) మాట్లాడారు. దీని కారణంగా హైదరాబాద్, అయోధ్య మధ్యలో.. డైరెక్ట్ విమాన సేవలు ప్రారంభం కానున్నాయని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడ్రోజుల చొప్పున మంగళవారం, గురువారం, శనివారం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.