విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ భోజనపల్లి నరసింహమూర్తి నియమితులయ్యారు. అయోధ్య మహానగరంలో విశ్వహిందూ పరిషత్ అఖిలభారత సమావేశాలు ఈనెల 25,26,27 తేదీలలో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలభారత సమావేశాలలో నరసింహమూర్తిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు. నరసింహమూర్తి గతంలో దశాబ్దం పాటు (1984 నుంచి 1994 వరకు) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ గా పనిచేశారు. గుంటూరు నగర, మరియు విజయనగరం జిల్లా ప్రచారక్ గా సేవలందించారు. ఆ తర్వాత భారతీయ మజ్దూర్ సంఘ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు. భాగ్యనగర్ కేంద్రంగా దిల్ సుఖ్ నగర్ జిల్లా RSS సంఘచాలక్ గా పదేళ్లు.. భాగ్యనగర్ సంబాగ్ ( గ్రేటర్ హైదరాబాద్) కార్యకారిణి సభ్యులుగా నాలుగేళ్లపాటు సంఘ కార్యంలో ఉన్నారు. బీఎస్సీ, బిఎల్ పూర్తిచేసిన నరసింహమూర్తి గత ఆరు నెలలుగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ.. ప్రస్తుతం అయోధ్యలో జరుగుతున్న సమావేశాలలో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.