|
modi add 1

విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా భోజనపల్లి నరసింహమూర్తి

విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ భోజనపల్లి నరసింహమూర్తి నియమితులయ్యారు. అయోధ్య మహానగరంలో విశ్వహిందూ పరిషత్ అఖిలభారత సమావేశాలు ఈనెల 25,26,27 తేదీలలో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలభారత సమావేశాలలో నరసింహమూర్తిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు. నరసింహమూర్తి గతంలో దశాబ్దం పాటు (1984 నుంచి 1994 వరకు) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ గా పనిచేశారు. గుంటూరు నగర, మరియు విజయనగరం జిల్లా ప్రచారక్ గా సేవలందించారు. ఆ తర్వాత భారతీయ మజ్దూర్ సంఘ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు. భాగ్యనగర్ కేంద్రంగా దిల్ సుఖ్ నగర్ జిల్లా RSS సంఘచాలక్ గా పదేళ్లు.. భాగ్యనగర్ సంబాగ్ ( గ్రేటర్ హైదరాబాద్) కార్యకారిణి సభ్యులుగా నాలుగేళ్లపాటు సంఘ కార్యంలో ఉన్నారు. బీఎస్సీ, బిఎల్ పూర్తిచేసిన నరసింహమూర్తి గత ఆరు నెలలుగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ.. ప్రస్తుతం అయోధ్యలో జరుగుతున్న సమావేశాలలో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

By NYALAKONDA ANIL DESAI | March 08, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1