యుగ ద్రష్ట 'హిందు చైతన్య శక్తి'కేశవ్ బలిరాంహెగ్డేవార్ మహాపురుషులు మరణించిన వారి బోధనలు కార్యశీలత‌ చూపిన మార్గం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.హిందూ సమాజ సంఘటనకు 'ఐక్యతకు వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దిశ దశను నిర్దేశించిన హెగ్డే వార్ చూపిన మార్గం నేటికిఅనుసరణీయం. జన జాగృతి _డాక్టర్ హెగ్డేవార్. కొంతమంది మహాపురుషులు భవిష్యత్తునుగురించినదార్శనికత 'సత్యాన్ని అనుభవించి, తమధృడమైనఆత్మబలంతోను, ధృడ విశ్వాసంతోను ముందుతరాలకుమార్గదర్శనం చేస్తారు. కొంత మంది సమాజ హితమే లక్ష్యంగా తమ జీవన విధానాన్ని గడుపుతూ త్యాగం 'సమాజ సేవా 'జన జాగృతి కొరకు తమ జీవితాన్ని అంకితం చేసిన కారణ జన్ముడు కేశవ్ బలరాం హెగ్దేవార్. హిందూ సమాజానికి మార్గదర్శి_ డాక్టర్ 'హెగ్డేవార్. కొంత మంది థైర్య సాహసాలతో లక్ష్య సాధనకు పట్టుదల నిరంతరం చైతన్యం తోకృషి చేస్తూ ప్రతికూల పరిస్థితులలో సమాజానికి దారి చూపుతూ జీవిస్తారు. సమాజ చీకటిని పారదోలే దీపంగ వెలుగు నిస్తారు. డాక్టర్ హెగ్డేవార్ అదే మార్గంలో పయనించి హిందూసమాజానికిమార్గదర్శిగా నిలవడం గమనార్హం. డాక్టర్ 'జీ _ఒక ఆశాజ్యోతి గురూజీ వాఖ్య. ఏదో ఒకసామాజిక కార్యక్రమం స్వీకరించి చేయడం మొదలు పెట్టిన తర్వాత వచ్చిన కష్టాలను ఎదుర్కొనక నిరాశ' నిస్పృహలకు లోనయ్యే వారికి డాక్టర్ జీ జీవితం నుంచి ఒక ఆశాజ్యోతి 'దివ్య సందేశం ప్రాప్తమై ప్రేరణ లభించగలదు. .. __గురూజీ డాక్టర్ జీ _యువతపై ప్రభావం. డాక్టర్ జీ కార్య కుశలత 'దృఢ దీక్ష 'దేశభక్తి యువతను ప్రభావితం చేసింది . వారు మరణించిన తరువాత కూడా వారి దూరదృష్టి సమాజం అంతటికీ వెలుగునిస్తూ ఉంటుంది. అటువంటివారినే 'యుగ ప్రవక్త' లేక 'యుగ ద్రష్ట' అంటారు. 1925 సం" లో ఆర్ 'ఎస్' ఎస్ స్థాపన _డాక్టర్ 'హెగ్డేవార్. హిందూ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వ్యవస్థాపకులు డా||హెడ్గేవార్ మహారాష్ట్ర నాగపూర్ పట్టణంలో 1925 వ సంవత్సరంలోస్థాపించారు. డాక్టర్జీ 'హెగ్డేవార్ పై జాతీయవాద ఉద్యమాల ప్రభావం డాక్టర్ హెగ్డేవార్ కాంగ్రెస్ సభ్యుడిగా బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించాడు. డాక్టర్ హెగ్డేవార్ 'స్వామి వివేకానంద 'లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఆలోచనలకు ప్రభావితమై పరాయి పాలన నుండి దేశాన్ని విముక్తి చేసి ధర్మ రక్షణకు జరిగిన ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. అజాద్ హిందూ ఫౌజ్ లాంటి జాతీయవాద సంస్థల ఉద్యమాలు డాక్టర్ జీ నీప్రభావితంచేశాయి.అరబిందో లాంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్త ల ప్రభావానికి లోనైన హెగ్డే వార్ 1921లో కిలాఫత్ ఆందోళనకు మహాత్మాగాంధీ ఇచ్చిన మద్దతు నచ్చక దేశ పరిస్థితుల దృష్ట్యా చెల్లచెదరైన హిందూ సమాజాన్ని ఏకం చేయాలని సంకల్పించాడు. కులాలు' జాతులు 'వర్గాలు' వర్ణాలు పేరుతో ఎవరికి వారే ఉంటున్న హిందూ సమాజాన్ని ఏకం చేయాలని సంకల్పించాడు. హిందూ ఐక్యత ధర్మ రక్షణ కొరకు 1925లో విజయదశమి రోజున కేవలం 5 గురు సభ్యులతో అర్‌'ఎస్' ఎస్ ను స్థాపించారు . ప్రపంచంలో అతిపెద్ద స్వచ్చంధ సంస్థ_ ఆర్ 'ఎస్' ఎస్. నాగపూర్ పట్టణంలో గుప్పెడు మందితో ప్రారంభమైన ఆర్' ఎస్' ఎస్ హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు విస్తరించింది. నేడు ప్రపంచంలో అతిపెద్ద స్వచ్చంధ సంస్థగా గుర్తింపు పొందింది . దేశం నలమూలల ప్రతి రోజు 80'000 శాఖలతో లక్షలాది స్వయం సేవకులు నిండు గుండెల్లో "భారత్ మాతాకీ జై"అంటూ ఐక్యతా నినాదాన్ని మంత్రాలుగా మలిచి ప్రతి వ్యక్తిలో జాతీయభావాలు నిరిపోశాడు. సంఘ శాఖల ద్వారా దేశభక్తులను తయారీని ప్రారంభించారు. ఆర్' ఎస్ 'ఎస్ హిందూ సమాజ ఐక్యతకు 'ధర్మ రక్షణకు జాతీయవాద పరివ్యాప్తికి నిరంతరం కృషి చేస్తుంది. జాతీయవాదం_ ధర్మ రక్షణ హిందూ ఐక్యత _ఆర్' ఎస్' ఎస్ లక్ష్యం. భారతీయుల్లో జాతీయవాదాన్ని ధర్మం కోసం హిందూ ఐక్యత కోసం జరిగిన ఎన్నో పోరాటాలకు ఆర్' ఎస్' ఎస్ స్ఫూర్తి. దేశం కోసం వ్యక్తుల్లో సమర్పణ భావాన్ని ప్రేరేపించడంలో ఆర్ 'ఎస్' ఎస్ మహత్తర పాత్రను పోషిస్తుంది. సమాజ సేవలో_ భాగస్వామ్యం. ఆర్ 'ఎస్ 'ఎస్ శాఖకు ప్రత్యక్షంగా రాకపోయినా పరోపక్షంగా అనేక క్షేత్రాల్లో ఎంతో మందిని సమాజ సేవలో దేశ మాత సేవలో తరింపచేస్తున్న గొప్ప సంస్థ ఆర్ 'ఎస్' ఎస్. దేశమేమిన్న _దేశమే సర్వస్వం_ఆర్ 'ఎస్' ఎస్. హిందూ ఐక్యతే ధ్యేయంగా దేశాన్ని బ్రిటిష్ వారి బానిసత్వం నుండి విముక్తి చేయడానికి అవిరళ పోరాట పటిమ ప్రదర్శించిన ఆర్ 'ఎస్ ఎస్ సమాజంపై గట్టి ప్రభావాన్ని చూపింది. చారిత్రిక తప్పిదాలను ఎండగడుతూ దేశమే మిన్న దేశమే సర్వస్వం అనుకోగల వ్యక్తుల సమూహాన్ని సమాజానికి అందిస్తుంది. సామాజిక సమరసతకు_ పెద్దపీట. సంఘ్ శాఖల్లో సామాజిక సమరతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.కుల జాడ్యానికి తావు లేకుండా స్వయం సేవకులను తయారు చేశారు. "ఆంధరం హిందువులం అందరం భారతీయులం " అనే ఆత్మీయ భావనను తీసుకువచ్చారు. సంఘ శిభిరాన్ని సందర్శించిన మహాత్మాగాంధీ' అంబేద్కర్ కులం గురించి ప్రశ్నిస్తే మేమంతా హిందువులం అని చెప్పడం వల్ల కులాల కుంపటి లేకుండా సామాజిక సమరసత వెళ్ళి విరియడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ హెగ్డేవార్ ఒక చైతన్య శక్తి. డాక్టర్జీ హెగ్డేవార్ ఆశించిన ఫలితాలుసాకారమై కనపడుతున్నాయి. అలాంటి సంస్థకు అంకురార్పణ చేసిన మనిషి నిజమైన దృష్ట అటువంటి యుగ ప్రవక్తలలో అగ్రశ్రేణి కి చెందిన వ్యక్తి మాత్రమే కాదు హెగ్దేవార్ ఒక చైతన్య శక్తిగా సమకాలీన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు . డాక్టర్ హెగ్డేవార్_ జననం. హెగ్డేవార్ పూర్వీకులు తెలంగాణలోని మహరాష్ట్ర సరిహద్దు సమీపాన బోధన్ తాలూకాలోని కందకుర్తి అనే చిన్న గ్రామానికి చెందిన వారు 1889ఏప్రిల్ 1( ఉగాది పండుగ రోజున) బలిరాం పంత్ హెగ్డేవార్ 'రేవతి బాయి దంపతులకు కేశవరావు బలిరాం హెగ్డేవార్ జన్మించారు. కుందుర్తి గ్రామం వద్ద గోదావరిలో మంజీర హరిద్ర నదులు కలిసి త్రివేణి సంగమం ఏర్పడుతుంది. ఆర్.ఎస్.ఎస్. పేరు దేశ విదేశాల్లో కోట్లమంది ప్రజలకు తెలుసు. కాని ఆర్.ఎస్.ఎస్. స్థాపకులు డా||బలీరాం కేశవ హెడ్గేవార్ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది వింతగా కనిపించినా నిజం. ఆయన గురించి కొంత తెలిసిన వారికి కూడ వారి గొప్పదనం, వారి దూరదృష్టి గురించి తెలియక పోవచ్చు. గొప్ప సంఘసంస్కర్త _డాక్టర్ హెగ్డేవార్. డా||కేశవ్ బలీరాం హెడ్గేవార్ మన జాతికే కాదు యావత్ మానవాళికీ తోడ్పడ్డారు. హిందూ జాతి పునర్ వికాసానికి శక్తి వంతమైన జాతి నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కర్త . నిత్యం జరిగే అర్ 'ఎస్ 'ఎస్ శాఖ ను వ్యక్తిత్వ నిర్మాణానికి వికాసానికి 'ఐక్యతా శక్తికి వేదికగా మార్చిన రూపశిల్పి. ధర్మ రక్షణ పునాదుల మీద దేశరక్షణకు అవిరళ కృషి చేసిన ఆదర్శ పురుషుడు హెగ్దేవార్. యుగ దృష్ట _డాక్టర్ హెగ్డేవార్ . కొంతమంది మహాపురుషులు భవిష్యత్తును గురించిన సత్యాన్ని అనుభవించి, తమ ధృడమైన ఆత్మ బలంతోను, ధృడ విశ్వాసంతోను ముందు తరాలకు మార్గదర్శనం చేస్తారు. ప్రతికూల పరిస్థితులలో సమాజానికి దారి చూపుతూ జీవిస్తారు. వారు మరణించిన తరువాత కూడా వారి దూరదృష్టి సమాజం అంతటికీ వెలుగునిస్తూ ఉంటుంది. అటువంటి వారు భౌతికంగా ప్రజలకు దూరమైనా, వారిని అనుసరించే వారు పెరుగుతూనే ఉంటారు. అటువంటి మహా పురుషులు తమకు ప్రజలలో పేరు ప్రఖ్యాతులు రావాలనీ, విస్తృత ప్రజానీకానికి తాము పరిచయం కావాలని కోరుకోరు. అటువంటివారినే 'యుగ ప్రవక్త' లేక 'యుగ ద్రష్ట' అంటారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డా|| హెడ్గేవార్ అటువంటి యుగ ప్రవక్తలలో ఒకరు. ఆర్ 'ఎస్' ఎస్ పెద్ద సంఖ్యలో స్వచ్చంధ సేవకులను నిర్మాణం చేస్తుంది. దేశం సంక్షోభ సమయంలో దేశానికి సేవ చేయగల వ్యక్తులను మంచి తనం మానవీయత సమర్పణ భావం సంస్కారవంతమైన సమాజాన్ని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం ఆర్ 'ఎస్' ఎస్ యొక్క లక్ష్యం నేను కాదు_ మనం అనే సమిష్టి భావన పరివ్యాప్తి_ ఆర్ 'ఎస్ 'ఎస్. నేను ఒంటరిని కాదు. నా చుట్టూ ఉన్న సమాజం నాది. ఆది నాతోనే ఉంటుంది అని హిందూ సమాజం నరనరాల్లో నేను కాదు మనం అనే భావన ఇంకిపోవాలనే ఆలోచించి స్థాపించిన ఆర్ ఎస్ ఎస్ వ్యక్తుల్లో సమష్టి భావన వ్యాప్తిలో కృతకుత్త మైందనీ చెప్పవచ్చు. భారత్ మాతాకీ జై నినాదం_ ఐక్యతా మంత్రం. సంఘ శాఖలో దేశంలో వేర్వేరు సాంప్రదాయాలు పాటించే వారు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైనప్పటికీ ముక్త కంఠంతో భారత్ మాతాకీ జై అని నినదిస్థారు. ఇది ఒక ఐక్యతా మంత్రం.తద్వారా భారతదేశం నాదేశం అనే భావన బలపడుతుంది. అంటరాని తనం 'భాషాబేధం 'ప్రాంత బేధం అంతరించి పోతుంది. అందరిని ఒకే విధంగా ప్రేమించడం .'సమానత్వం పాటించడం జరుగుతుంది. అధికార బోధ కాకుండా కర్తవ్య బోధజాగృతమౌతుంది. సంఘం పరిది _విస్తరణ. సంఘం తన కార్యక్రమాలు ప్రారంభించుకొని 99 సంవత్సరాలు పూర్తయింది. సంఘం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ కార్యపరిధిని మరింత విస్తృత పరచడంకోసం సంఘ ఆలోచన పరివ్యాప్తి కోసం జాతీయవాద శక్తుల బలోపేతం ద్వారా దేశ రక్షణ ధర్మ రక్షణలో పౌరసమాజం క్రియా శీలక పాత్రను చోదక శక్తిగా తీర్చిదిద్దాలని సంకల్పంచడం జరిగింది. ఐదు అంశాలు ఎంపిక. సంఘ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 5 అంశాలను ఎంపిక చేయడం జరిగింది. సామరస్యత_ సంస్కారం. 1)వ్యక్తిగత కుటుంబ సామాజిక వ్యవహారాలు సామరస్య పూర్వకంగా జరగాలి. అంటరాని తనం నిర్మూలించబడాలి. కుటుంబాల్లో సంస్కారం పెరగాలి పర్యావరణ రక్షణ. 2) పౌరసమాజం పర్యావరణ రక్షణ 'నీటి వినియోగం 'నీటి సంరక్షణ ప్రతి వ్యక్తి పుట్టిన రోజు ఒక మొక్కను నాటడం కాలుష్య నివారణ 'ప్లాస్టిక్ వినియోగం రద్దు. తప్పని సరి ఓటు హక్కు. 3)సామాజిక బాధ్యతలను నిర్వహించడం తప్పని సరి ఓటు హక్కును వినియోగించాలి. స్వదేశీ _స్వాభిమానం. 4) స్వదేశీ భావన పరివ్యాప్తి చేయడం స్వాభిమానం ఉపాధిఅవకాశాలను మెరుగుపరచడం. ప్రతి ఒక్కరు ఖద్దరు వస్త్రాన్ని ధరించడం. 5) సహజ వనరుల రక్షణ దేశ భాషల పట్ల స్వాభిమానాన్ని పెంచడం. భూకంపం వరదలు తుపాను అకాల ప్రకృతి విపత్తులు కుంభమేళాలు సంభవించినప్పుడు బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చే సమాజ సేవకులను ఆర్ ఎస్ ఎస్ తయారు చేస్తుంది మనం అనే భావనతో సేవాకార్యక్రమాలు. దేశంలో ప్రస్తుతం స్వయం సేవకుల ద్వారా మనం అనే భావన తో 160000సేవా కార్యక్రమాలు జరుగు తున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలు భారత దేశానికే పరిమితం కాలేదు. హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరుతో ప్రపంచములో 80 దేశాల్లో విస్తృతంగా పనిచేస్తుంది. సమాజంలో కర్తవ్య భావనను జాగృతం చేయడం జరుగుతుంది. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో వలస కూలీలకు ఆహారం నివాసం ఇచ్చి ఆదుకొని ఆపన్న హస్తం అందించిన సమస్త మానవ కళ్యాణం కోసం నిరంతర కృషి చేసే సంస్థ కార్యకలాపాల విస్థ్రరణకు స్ఫూర్తి దాతగా నిలిచిన హెగ్దేవార్ జయంతిని స్మరించుకోవడం వారి ఆశయాల సాధనకు పనిచేసే స్ఫూర్తిని మనలో నింపిన ఆధునిక యుగ ద్రష్ట ప్రవక్త గా నిలవడం భారత జాతికి గర్వకారణం. నేదునూరి కనకయ్య అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక 'తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం కరీంనగర్ 9440245771