రాయికల్ //జనం గొంతు : రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ప్రత్యేక అధికారి చిరంజీవి, కార్యదర్శి రాజేష్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 75వ వన మహోత్సవంలో భాగంగా గురువారం రోజు ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, వి ఒ ఏ లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.