ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో సర్ సివి రామన్ నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్ ఫెయిర్ మరియు గణిత నమూనాలను ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులు వివిధ రకాల నమూనాలను ప్రదర్శించి సైన్స్ పట్ల ఉన్న ఆసక్తిని ప్రదర్శించారు. మరియు వివిధ రకాల సైన్స్ పటాలను రంగురంగుల కలర్స్ తో నేలపై గీసి ప్రదర్శించడం జరిగింది. మరియు సాయంత్రం విద్యార్థి క్విజ్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీధర్ తో పాటు గణిత మరియు సైన్స్ ఉపాధ్యాయులు సలావుద్దీన్, ప్రవీణ్ కుమార్, రజిత, ఉషారాణి, ప్రదీప, జ్యోతి మరియు రవళి, అఖిల తో పాటు మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
Comments 0