రాయికల్ మండలం కైరీ గూడెం గ్రామంలో రెండు అత్యంత నిరుపేద కుటుంబలకు సామాజిక సేవకులు కడకుంట్ల జగదీశ్వర్ శ్వేత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిత్యావసర సరుకులు బియ్యం, పప్పు నూనెలు కూరగాయలు పంపిణీ చేశారు. ఇట్టి సందర్భంగా గ్రామస్తుడు సిపెల్లి నర్సయ్య మాట్లాడుతూ కరొన కాలంలో వేలాది పేదలకు నిత్యావసర సరుకులు అందజేసిన జగదీశ్వర్ శ్వేత దంపతుల సేవ నిరతి అభినందనీయం అని వారి సేవ నిరతి విరామం లేకుండా కొనసాగడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నరేష్ ,మల్లేష్, మిత్రులు ఎద్ధండిముత్యంపు రాజు రెడ్డి,చింతకుంట సాయికుమార్, సయ్యద్ రసూల్, ఇమ్మడి విజయ్, గంట్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments 0