శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని విస్డం కిడ్స్ వరల్డ్ ప్లే స్కూల్లో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని నిర్వహించారు. కృష్ణుడి లీలలు, తన గొప్పతనాన్ని తలుచుకుంటూ విద్యార్థులు పలు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ .ఎం రాజు రెడ్డి మాట్లాడుతూ కృష్ణుడు మానవాళికి అందించిన గీత ఉపదేశము సరైన జీవన విధానాన్ని నేర్పుతుందని శ్రీకృష్ణుడిని జగద్గురువుగా కొలుస్తారని ఈ సందర్భంగా తల్లి తండ్రి గురువులకు చిహ్నంగా ప్రతి విద్యార్థి మూడు మొక్కలు నాటాలని సూచించారు. విద్యార్థుల శ్రీకృష్ణ, గోపికల వేషధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం పిల్లల కేరింతల మధ్య ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నివేదిత రెడ్డి, పోషకులు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు