సుల్తానాబాద్, జూలై 14 (జనం గొంతు) : సుల్తానాబాద్ పట్టణంలో 271 గ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు. పట్టణంలోని పూసాల రోడ్డులో ఎస్సై శ్రావణ్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు నిర్వహిస్తుండగా పూసాల నుండి సుల్తానాబాద్ వైపు స్కూటీపై వస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో,ఆపి చెక్ చేయగా స్కూటీలో గంజాయి లభించింది. పంచాయతీ సెక్రటరీలు ప్రమోద్ కుమార్, పాపయ్య లు ఎస్సై శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి, విచారించగా నిందితుడు చంద్రపూర్ నుండి గంజాయి విక్రయించి తీసుకొచ్చి సుల్తానాబాద్ లో సప్లై చేస్తున్నట్టుగా అంగీకరించాడని, అతని వద్ద రైల్వే టికెట్ బస్సు టికెట్ మొబైల్ ఫోను బైక్ 271 గ్రాముల గంజాయి లభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments 0