|
modi add 1

ఘనంగా స్వామి వివేకానంద జయంతి

ఘనంగా స్వామి వివేకానంద జయంతి రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆయన ప్రసంగాలు యువకుల్లో చైతన్యం నింపుతాయి. అందుకే ఆయన జయంతి రోజైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డే నిర్వహించాలని 1984లో భారత ప్రభుత్వం నిర్ణయించింది. 1985 నుంచి ఏటా వివేకానందుడి ఆదర్శాలు కొనసాగేలా యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. జనవరి 12వ రోజును యువ దివస్ అని కూడా పిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు కొమ్ముల ఆది రెడ్డి, జెడ్ సి కాటిపెల్లి రామ్ రెడ్డి, డిసి బత్తిని భూమయ్య, కోశాధికారి గంట్యాల ప్రవీణ్, లయన్స్ సభ్యులు ఎద్దండి దివాకర్, కొత్తపెల్లి రంజిత్, వాసం ప్రసాద్ పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | January 12, 2024 | 0 Comments

హిందూ ధర్మ పరిరక్షణే ఆర్.ఎస్.ఎస్ ధ్యేయం...

హిందూ ధర్మ పరిరక్షణే ఆర్.ఎస్.ఎస్ ధ్యేయం... జిల్లా సహ శారీరక్ ప్రముఖ్ నూతికట్ల సత్యం... రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి హిందూ ధర్మ పరిరక్షణే ఆర్.ఎస్.ఎస్ ధ్యేయమని జిల్లా సహ శారీరక్ ప్రముఖ్ నూతికట్ల సత్యం అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి ఉత్సవము, వివేకానంద జయంతి లలో ప్రధాన వక్త గా పాల్గొని ఆయన మాట్లాడుతూ సంక్రాంతి ప్రకృతిలో వచ్చే మార్పుల ఆధారంగా సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశి లో ప్రవేశించిన సందర్భంగా జరుపుకునే పండుగ అని అన్నారు. హిందూ పండుగల్లో సామాజిక సమరత, ఐక్యత, సనాతన ధర్మ ఆచరణలు ఇమిడి వున్నాయని అన్నారు. సంఘం నిత్యశాఖ ద్వారా వ్యక్తినిర్మాణం చేస్తుందని, జాతీయ భావన, దేశభక్తి, సమర్పణ, త్యాగ భావాలను, ధైర్యాన్ని, మానసిక, శారీరక ధారుఢ్యాలను వికసింప జేస్తుందని, శాఖ మనోవిజ్ఞాన కేంద్రం గా పని చేస్తుందని అన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను సంఘం ఆచరిస్తుందని, యువత వివేకానంద ఆశయాలను స్ఫూర్తి గా తీసుకొని ఆదర్శవంతమైన శక్తివంతమైన యువశక్తి గా ఎదిగి దేశహితం కోసం లో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ నెల-22 న అయోధ్య లో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠతో 500 వందల సంవత్సరాల నుండి పోరాట చేసిన కోట్లాదిమంది హిందువుల కళ సాకరమవుతుందని, ఆ రోజున హిందువులందరు తమతమ నగరాల్లో, గ్రామాల్లో గల దేవాలయాలను దర్శించుకుని ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని టీవీల్లో తిలకించాలని, ఆ రోజు రాత్రి ప్రతీ ఇంటిలో ఐదు దీపాలు వెలిగించాలని, రెండు దీపాలు ఇంటి లో దేవుని వద్ద, రెండు దీపాలు ఇంటి ముఖ ద్వారం వద్ద, ఒకటి తులసీ మాత వద్ద వెలిగించాలని, ఐదు దీపాలు ఐదు వందల సంవత్సరాల పోరాట విజయానికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ్ వేల్పుల స్వామి యాదవ్, కుర్మ మల్లారెడ్డి, దొంగ జితేందర్, సురేందర్, సుంకిశాల సత్యం, బయ్యని అంజి, లోకిని స్వామి, రొట్టె శ్రీధర్, గజ్బిన్కర్ కిరణ్, మహేష్, నవనీత్, పవన్, జశ్వంత్, శ్రీకర్, శ్రీమాన్, అభిరాం తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | January 12, 2024 | 0 Comments

టిఎస్ఎండిసి కనుసన్నల్లో ఇసుక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

జనం గొంతు //ఓదెల// సతీష్ కుమార్ ఆమ్యామ్యాలతో అడ్డగోలు ఇసుక దోపిడి స్థానికులు, విలేకరుల సమక్షంలో బయటపడిన అక్రమాలు మానేరు నది అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ఇసుక కాంట్రాక్టర్లు జేబులు నింపు కుంటున్నారు. నిబంధనలు కఠినంగా అమలు పరచాల్సిన టిఎస్ఎండిసి అధికారులు అవినీతి మత్తులో మునిగి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లోని గుండ్లపల్లి ఇసుక క్వారీలో జరుగుతున్న అక్రమాలపై స్థానిక రైతులు చేసిన ఫిర్యాదు మేరకు విలేకరులు ఇసుక క్వారీని పరిశీలించగా అనేక అక్రమాలు బహిర్గతమయ్యాయి. ఎన్నో లారీలు క్వారీ బయట క్యూ కట్టి తమ వంతు కోసం ఎదురు చూస్తుంటే జీరో దందాతో నడిచే కాంట్రాక్టర్ల లారీలు మాత్రం రాజమార్గంలో ఓవర్ లోడ్ తో ఇసుకను నింపుకొని దర్జాగా వెళుతున్నాయి. విలేకరులు పరిశీలన ప్రారంభించేసరికి సుమారు 30 లారీలు ఇసుకను లోడ్ చేసుకోకుండానే వెనుతిరిగాయి. ఆ లారీ యజమానులు ప్రభుత్వానికి ఎలాంటి డీడీలు చెల్లించకుండానే వారి వద్ద కాంట్రాక్టర్లకు మామూళ్లు చెల్లించి లారీల నిండా ఇసుకను నింపుకొని ఓవర్ లోడుతో జీరో దందా నడుస్తున్నట్లు స్థానిక రైతులు ఆరోపించారు. సమయపాలన లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో కాంట్రాక్టర్లు ఇసుక క్వారీలో తమ దోపిడీని కొనసాగిస్తుంటే, చర్యలు చేపట్టాల్సిన టిఎస్ఎండిసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వెనుక మతలబు ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దందా నిత్యం మూడు బకెట్లు 30 వేలుగా కొనసాగుతోందని వారు సెలవిచ్చారు. స్థానికులు మరియు విలేకరులు అందించిన సమాచారం మేరకు ఎన్జీటీ పిటిషన్ దారులు చిటికేసి సతీష్ కుమార్ మరియు సురేందర్ రెడ్డిలు గుండ్లపల్లి ఇసుక క్వారీని సందర్శించి పరిశీలించగా.. ఓవర్ లోడుతో లారీలు వెళుతున్నట్టు స్పష్టమైనది. 26 టన్నుల ఇసుక కొరకు డీడీలు చెల్లించిన ఒక లారీ యజమాని నుండి క్వారీ నిర్వాహకులు వేల రూపాయలు లంచంగా తీసుకొని సుమారు 15 టన్నుల ఇసుకను అధికంగా అతని లారీలో లోడ్ చేశారు. ఇట్టి అక్రమ వ్యవహారంపై టిఎస్ఎండిసి ప్రాజెక్టు అధికారులకు ఫిర్యాదు చేయగా వే బ్రిడ్జిలో లోపం ఉందని, బరువు సరిగా తూచడం లేదని క్వారీ యజమానులకు వత్తాసు పలుకుతూ దాటవేశారు. ఇప్పటికైనా అక్రమాలకు నిలయమైన ఇసుక క్వారీలను మూసివేయాలని లేదంటే కనీస నిబంధనలు పాటిస్తూ అవినీతికి తావు లేకుండా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల శ్రీనివాస్ యాదవ్, స్థానిక రైతులు పొల్లూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | January 21, 2024 | 0 Comments

శిల్ప కళా చక్రవర్తి కి పురస్కారం

జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ (JCI) అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉత్తమ సేవలు, ప్రతిభవంతులకు "ప్రతిభ పురస్కార్ అవార్డ్ " లను అందించారు. ఇట్టి కార్యక్రమంలో సముద్రాల రాజమ్మ-చంద్రయ్య (మాజీ సర్పoచ్) కురిక్యాల గ్రామం గారి ద్వితీయ కుమారుడు సముద్రాల ప్రభాకర్, శిల్పి & ఆర్ట్స్ గారి యొక్క అబ్బురపరిచే, ఔరా అనిపించే చిత్రాలు,విగ్రహాలను జీవం ఉట్టిపడేల తీర్చిదిద్దిన అతని కళను గుర్తించి "అవుట్ స్టాండింగ్ విశిష్ట ప్రతిభ పురస్కార్ అవార్డు" ను అందించి ఘనంగా సత్కరించారు. గతంలో జాతీయ కళా రత్న అవార్డు మరియు ఉత్తమ కళాస్పూర్తి అవార్డు లను అందుకున్నారని, ఇతని అద్భుతమైన కళ కు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని JCI సంస్థ వారు ప్రశంసల వర్షం కురిపించి అభినందించారు.

By Miryala Pranay | February 04, 2024 | 0 Comments

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్ పిలుపు సమ్మె వాల్ పోస్టర్ విడుదల ఏటూరునాగారం,జనం గొంతు, జయరాజు కేంద్ర బిజెపి కార్మిక ప్రజావ్య తిరేక విధా నాలను తిట్టుకో డందాం కార్పొరేట్ అనుకూల మతత త్వ విధానాలను ప్రతిఘ టిస్తూ ప్రభుత్వంగాన్ని కాపా డుకుందాం అనే నినా దంతో ఫిబ్రవరి 16 దేశవ్యా ప్తంగా జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు ఐఎన్ టి యుసి ఏఐటియుసి సిఐటి యు, హెచ్ఎంఎస్,3 ఐ ఎఫ్ టి యు లు, బి ఆర్ టి యు, టి ఎన్ టి యు సి,ఏ వీటితో పాటు ఉద్యోగ సంఘాల ఆల్ ఇండియా ఫెడరేషన్లు, స్కీం వర్కర్ల ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సంఘా లన్నీ ఈ సమ్మెకు పిలుపుని చ్చాయని సిఐటి యు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్ అన్నారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో కి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ సంవత్స రానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక మైన రైల్వే రోడ్లు గ్యాస్ ఓడరేవు లాంటి వాటి ఆస్తులను ప్రైవేటు వారికి కట్టబెట్టి లక్షల కోట్లు కట్టబెట్టాలని చూసిందన్నారు అందుచేతనే ఉద్యోగ కార్మిక రైతు బ్యాంకింగ్ అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతుతో ఈ యొక్క సమ్మె జరుగుతుం దన్నారు.కనీస వేతనం 26000 చెల్లించాలి స్కీము లకు బడ్జెట్ పెంచాలి నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, ప్రభుత్వం రంగ సంస్థలు అమ్మడం ప్రైవేట్ పరం చేయడం ఆపాలి కాంట్రాక్టు విధానం రద్దుచేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి ధరల పెరుగుదలను అరికట్టాలి, ఆహార వస్తువుల నిత్యవస రాలపై జిఎస్టి ఉపసంహరిం చుకోవాలనే డిమాండ్స్ తో ఈ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగ కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల ని కోరారు.ఈ యొక్క కార్య క్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు బాలోజు రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిటమట రమేష్,కార్మికులు ఎం పెళ్లి మురళి,నాయిని కృష్ణ,గోగు మల్లయ్య,డి. చిన్న,వి కృష్ణ,వి ఎల్లయ్య,డి రాంబాబు,వి సుధాకర్,వెంకన్న జిపి కార్మికుడు,జే సమ్మయ్య,రిక్షా కార్మికులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 15, 2024 | 0 Comments

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాయికల్ పట్టణానికి చెందిన గట్టుపెళ్లి రాంబాబు చికిత్స కోసం 1996-97 పదవ తరగతి స్నేహితులు రూ.1లక్ష 500 ఆర్థిక సాయాన్ని గురువారం కుటుంబ సభ్యులకు అందించారు.తోటి మిత్రుడు త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆర్థిక సాయం అందించిన పదవ తరగతి పూర్వ విద్యార్థులకు రాంబాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచ్చ శేఖర్, రాచర్ల ఆంజనేయులు,సిలివేరి సురేష్, భూమి మహేష్,సాంబారు శ్రీనివాస్,బెజ్జంకి హరికృష్ణ, కడార్ల శ్రీనివాస్,మండ రమేష్,వాసం శివకుమార్,పురెల్లి శ్రీనివాస్,రాజేశం,బసవరాజు,శ్రీపతి సత్తయ్య,మారంపల్లి రమేష్,బండి రామకృష్ణ, మ్యాకల నరేష్,మచ్చ కృష్ణ,పడాల రమేష్, పిన్నం శెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 16, 2024 | 0 Comments

ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం రోజున రాయికల్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద శివాజీ సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ పెద్దలు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని తన రాజ్యంలోని ఆడవాళ్ల అందరిని మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చేవారని అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మహారాజు శివాజీ ఒక్కరేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ గోనె కాపు సంఘ కోశాధికారి కడపటి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, సంఘ సభ్యులు జలపతి రెడ్డి, భూమారెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, ఎద్దండి రాజు రెడ్డి, రంజిత్, మహిపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 19, 2024 | 0 Comments

చంద్రశేఖర అజాద్

జన్మస్థలం: బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం నిర్యాణ స్థలం: అలహాబాదు, ఉత్తర ప్రదేశ్, భారతదేశం ఉద్యమం: భారత జాతీయ ఉద్యమం ప్రధాన సంస్థలు: నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ, హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ బాల్యము మార్చు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారికి, అగరాణీదేవికి చంద్రశేఖర అజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాసిలో చదివించాలను పట్టుదల వుండేది. కాని ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోడానికి తల్లి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించ లేక తన పదమూడవ ఏట ఇల్లొదిలి ముంబయి పారి పోయాడు. ముంబయిలో ఒక మురికి వాడలో నివసించాడు. బ్రతకడానికి కూలి పనిచేశాడు. అనేక కష్టాలు పడ్డాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించ లేదు. ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది. రెండేళ్ళ ఆ మురికి వాడలో నికృష్టమైన జీవనం తర్వాత 1921 లో వారణాసికి వెళ్ళిపోయి అకడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అదే సమయంలో భారత స్వాతంత్ర్యం కొరకు మహాత్మా గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడికినట్టున్నది. అప్పుడే చంద్ర శేఖర్ తాను కూడా భారత స్వాతంత్ర్యం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించు కున్నాడు. అప్పుడతని వయస్సు పదిహేనేళ్ళు మాత్రమే. ఉత్సాహంగా తాను చదువుతున సంస్కృత పాఠశాలముందే ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయ మూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తల తిక్క సమాదానాలు చెప్పాడు. నీపేరేంటని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లెక్కడ అని అడిగితే జైలు అని తల తిక్క సమాదానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15 రోజులు జైలు శిక్ష విధించాడు. ఇతని తలతిక్క సమాదానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో ఏమోగాని తాను విధించిన 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్వ బోధ చేసింది. ఆ విధంగా చంద్రశేఖర్ .... చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు. ఈలోపు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ అజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు. దాంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్కులో తమ ఇతర విప్లవ మిత్రులతో భగత్ సింగ్ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులున్నారని అనుమానమొచ్చింది ఆజాద్ కి. వెంటనే తన రివ్వార్ కి పని చెప్పాడు. ముగ్గురు పోలీసులు అతని తూటాలకు బలైపోయారు. ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు అజాద్ ని వెంబడిస్తూనే ఉన్నారు. ఆజాద్ వారిని తన రివ్వాల్వర్తో నిలవరిస్తూనే ఉన్నాడు.తన తుపాకీలో ఇంకో తూటానే మిగిలి ఉంది. అది మరొకని ప్రాణం మాత్రమే తీయ గలదు. ఆ తర్వాత తాను పట్టుబడటం ఖాయం అని తెలిసిపోయింది. చీ బ్రిటిష్ వారికి తాను పట్టుబడటమా అంతే మరో క్షణం ఆలోసించ లేదు ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టబడిన తన తుపాకి తన తలవైపు మళ్ళింది. అంత 25 ఏండ్ల యువకుడు చంద్రశేఖర ఆజాద్ అమరుడయ్యాడు.. ఇది జరిగిన రోజుకి సరిగ్గా 25 రోజుల తర్వాత భగత్ సింగ్ ను ఉరి తీశారు. చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) 1906 జూలై 23 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు . ఈయన భారతీయ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమర యోధుడు - చంద్రశేఖర్‌ అజాద్. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు...చంద్రశేఖర్ అజాద్.కా.షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కా.చంద్రశేఖర్ అజాద్ ను మరొకమారు గుర్తుచేసుకొని అతను ఆశయాల సాధనలో భాగమవుదాం . సీతారాం తివారీ, జగరాణి దేవీల ఐదో సంతానంగా జన్మించిన చంద్రశేఖర్‌ అజాద్‌ పేదరికంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుంచి ధైర్యసాహసాలు చూపేవారు. ప్రజల నుంచి మహాత్మాగాంధీ వరకు నీరాజనాలు అందుకుంటున్న రోజులవి. 1921లో గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్‌ కూడా జనంతో కలిసి వందేమాతరం విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాల చేస్తుంటే పోలీసులు కొట్టారు. ఇది సహించలేక రాయిని గురి చూసి పోలీసులను కొట్టి అదృశ్యమయ్యాడు. బ్రిటిష్ దురాక్రమణకు వ్యతిరేకంగా 1857లో స్వాతంత్ర్య సమరజ్వాలలు ఎగసిపడినాయ. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం సిద్ధించేవరకూ గడచిన 90 ఏళ్లలో దేశ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలు సాగాయి. పంజాబ్‌లో రామసింగ్ కూకా (నాంధారీ ఉద్యమం), మహారాష్టల్రో వాసుదేవ బల్వంత్‌ఫడ్‌కే, ఛపేకర్ సోదరులు, భగత్‌సింగ్, యస్ఫతుల్లాఖాన్, రాజగురు, రాంప్రసాద్, బిస్మిల్, భగవతీచరణ్, అల్లూరి సీతారామరాజు, కుమరంభీం, చంద్రశేఖర్ అజాద్.. ఇంకా అనేకమంది వీరుల బలిదానాలు కొనసాగాయి. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని బావరా గ్రామంలో జగరాణిదేవి, సీతారాం తివారీల కడుపుపంటగా చంద్రశేఖర్ తివారీ జన్మించాడు. అతనుే చంద్రశేఖర్ అజాద్. 24 ఏళ్ల ప్రాయంలో స్వాతంత్ర్య సమర యజ్ఞంలో ఆహుతయ్యేవరకూ అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడైనాడు ఆజాద్.15 ఏళ్లు కూడా నిండని అతి పిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం సర్వ సమర్పణకు సంసిద్ధమైనవాడు చంద్రశేఖర్ అజాద్. 1931 ఫిబ్రవరి 27 ఉదయం సుఖదేవ్ రాజ్‌తో ఒక ముఖ్య విషయం మాట్లాడుతూ ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో ఓ చెట్టుకింద అజాద్ కూర్చుని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డితిన్న ఓ యువకుడు ఉప్పందించాడు. నాలుగు వ్యాన్‌లలో పోలీసులను ఎక్కించుకుని పోలీసు అధికారులు లార్ట్‌బావర్, విశ్వేశ్వర సిన్హాలు ఆల్‌ఫ్రెడ్ పార్క్‌కు చేరారు. ఒక శక్తివంతమైన బుల్లెట్ అజాద్ తొడ నుండి దూసుకుపోయింది. అయినా, బాధను లెక్కచేయక అజాద్ తన రివాల్వర్‌తో లార్ట్ బావర్‌ను కాల్చాడు. విశ్వేశ్వర సిన్హా కాల్పులు జరుపుతుండగా అజాద్ కుడిచేతికి గాయమైంది. వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది. అక్కడ మోహరించి వున్న పోలీసు బలగాలు గుళ్ల వర్షం కురిపిస్తుండగా అజాద్ తన రివాల్వర్‌తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు. చివరకు రివాల్వర్‌లో ఒక గుండు మాత్రమే మిగిలింది. సుఖదేవ్ రాజ్ సురక్షితంగా అక్కడ నుంచి తప్పించుకు పోయేందుకు సహకరించాడు. ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజంచేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నాడు. అజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వన్నె తెచ్చిన ఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్వల ఉదాహరణ.

By NYALAKONDA ANIL DESAI | February 27, 2024 | 0 Comments

12న తెలంగాణ స్థానిక పత్రికల డిమాండ్లపై రాష్ట్రస్థాయి సదస్సు

12న తెలంగాణ స్థానిక పత్రికల డిమాండ్లపై రాష్ట్రస్థాయి సదస్సు అక్రిడిటేషన్లు, ప్రకటనల కేటాయింపులో స్థానిక పత్రికలకు తీరని అన్యాయం డబ్ల్యూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో స్థానిక పత్రికల పట్ల వివక్ష కొనసాగుతోందని బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. అక్రిడిటేషన్లు, రేట్ కార్డ్ విషయంలో తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాలకు అన్యాయం జరుగుతూ వచ్చిందని ఆరోపించారు. బుధవారం కరీంనగర్ డబ్ల్యూజేఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వరాష్ట్రం ఏర్పడితే తమకు న్యాయం జరుగుతుందని స్థానిక పత్రికల యాజమాన్యాలు భావించాయని, అయితే గడచిన పదేళ్ల కాలంలో స్థానిక పత్రికల పరిస్థితులు మరింత దిగజారి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రాపకంతో, పైరవీలతో కొందరు మాత్రమే పెద్ద పత్రికల ముసుగులో లబ్ధి పొందారని, విలువలతో నిత్యం పత్రికలు వెలువరిస్తున్న వారికి మాత్రం తీరని అన్యాయం జరిగిందని అన్నారు. 12 న స్థానిక పత్రికల హక్కుల సాధనకై సదస్సు ఈనెల 12వ తేదీన హైదరాబాద్ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాలులో 'తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాలు- అక్రి డిటేషన్లు- రేటు కార్డు' విషయంలో జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో స్థానిక పత్రికల యాజమాన్యాల నుండి సలహాలు, సూచనలు తీసుకొని వాటిని క్రోడీకరించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనున్నట్లు చెప్పారు. స్థానిక పత్రికల యాజమాన్యాలకు గుర్తింపు, గౌరవం దక్కేంతవరకు డబ్ల్యూజేఐ పోరాడుతుందన్నారు. స్థానిక పత్రికలకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అనునిత్యం ప్రభుత్వంతో ప్రాతినిధ్యం జరుపుతామని స్పష్టం చేశారు. 12వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాల సదస్సుకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పత్రికలు నిర్వహిస్తున్న ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ లోకి... వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అక్రిడికేషన్ సమస్యల పరిష్కార కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా తాడూరు కరుణాకర్, యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా,అక్రిడిటేషన్ కమిటీ రాష్ట్ర సభ్యునిగా శివనాద్రి ప్రమోద్ కుమార్, రాష్ట్ర జాయింట్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బెజ్జంకి నరేష్ లను నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు.

By NYALAKONDA ANIL DESAI | November 06, 2024 | 0 Comments

77 ఏళ్లుగా వెలుబడుతున్న ఏకైక జాతీయ వాద పత్రిక... గర్వించదగిన తెలుగు వార పత్రిక "జాగృతి"

*ఒక పత్రిక 10 వేల సైన్యం తో సమానం... *వాదాల పేరుతో వాస్తవాలు మరుగున పడుతున్నాయి.. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జి... 1948 లో ప్రారంభమై 77 ఏళ్ళుగా వెలుబడుతున్న ఏకైక జాతీయవాద పత్రిక, గర్వించదగిన తెలుగు వార పత్రిక జాగృతి అని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జితెలిపారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వార పత్రిక జాగృతి పాఠకుల ఆత్మీయ సమ్మేళనము బుధవారం రోజున సాయంత్రం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా గల రెవెన్యూ గార్డెన్స్ లో జరిగింది. ఇట్టి ప్రోగ్రాం కు ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలుగు పత్రికల చరిత్ర నిస్సందేహంగా ఘనమైందన్నారు. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో పత్రికలు ప్రముఖపాత్రనుపోషించాయన్నారు. ఆ రోజుల్లో ఆంధ్ర పత్రిక, కృష్ణ పత్రిక, ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ఆంధ్రప్రభ లాంటి ఎన్నో పత్రికలు ఉండేవని , ఆ తర్వాత ఈనాడు , ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు వచ్చాయన్నారు. నేడు మీడియా రంగం ఎంతో విస్తరించిందన్నారు. డిజిటల్ , సోషల్ మీడియా తో వేగంగా సమాచార వ్యాప్తి జరిగే పరిస్థితులు వచ్చాయన్నారు. ఒక పత్రికపదివేలసైన్యంతోసమానమన్నారు. కానీ నేడు వాదాల పేరుతో వాస్తవాలు మరుగున పడిపోతున్నాయన్నారు. భారతీయత మీద వక్ర భాష్యాల విషపుజల్లులుకురుస్తున్నాయన్నారు. ఏ పత్రిక అయినా సదాశయంతోనే ప్రారంభమవుతుందని, అర్థవంతమైన పేరు , ఆదర్శనీయమైన ప్రయాణం రెండు కన్నులుగా సాగిన పత్రికల జాడ చరిత్ర లో ఒకింత తక్కువేనన్నారు. జాతీయ భావజాలం తో, ధర్మం, రక్షణ కోసం ఈ మట్టి పరిమళంతో వేలుబడుతు , ఎన్నో అటు పోట్లను ఎదుర్కొని 77 ఏళ్లుగా నిలబడిన ఏకైక వార పత్రిక జాగృతి యే నన్నారు. ప్రధానంగా జాతీయతకు సుదూరంగా ఉండే ప్రభుత్వాల ఏలు బడిలో కత్తి సాము చేసిన ఘనత జాగృతి దే న్నారు. జాగృతి ముఖ్యంగా జాతీయ భావాజాలను వ్యాప్తం చేసిందని, ప్రజల అవసరాలను గుర్తించి, ఎన్నో రచనలు చేసి సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నాలు చేసిందన్నారు. గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా జాగృతి స్వరాజ్య సమరయోధుల పోరాట ఆశయాన్ని ఆవిష్కరించడానీకే శ్రమిస్తుందన్నారు. ఇలాంటి పత్రికను మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రజలతో మమేకమవుతూ సమాజం కోసం పలువిధాలపాటుపడుతుందన్నారు.. నేడు దేశంలోని సామాజిక రంగాల్లో ప్రవేశించి, ఒక జాతీయ శక్తిగా సంఘం ఎదిగిందన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బాధ్యులు కట్ట రాజగోపాల్, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి. దురిశెట్టి నిరంజన చారి , పాక సత్యనారాయణ, ఎలగందుల సత్యనారాయణ, కిషన్ జి, బాలరాజు , తడగోప్పు ల శంకరయ్య, గీకూరి శ్రీనివాస్ , మహేశ్వర్ , పుల్లూరి రామారావు , మురళీజీ , పరుశరాం జి తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | May 21, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1