రామగుండం లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన నలుగురిని గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా విచారణ అనంతరం ముగ్గురికి రూ.6,000 చొప్పున జరిమానా, మరో వ్యక్తికి రెండవసారి తప్పిదం కారణంగా 3 రోజుల జైలు శిక్ష విధించారు. ట్రాఫిక్ సీఐ బి. రాజేశ్వరరావు మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.