భారత స్వతంత్ర్య సమర జ్వాల... విప్లవోద్యమ భావుటా... తిరుగులేని కన్నడ రాజకీయ శక్తి... చెంగల్రాయరెడ్డి !! కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన చెంగల్రాయరెడ్డి... 1902, మే 5 న కర్ణాటక రాష్టం కోలార్ జిల్లా క్యాసంబెల్లిలో వొక్కలిగ రెడ్డి కుటుంబంలో జన్మించారు. ఊరిపేరుతోనే క్యాసంబెల్లి చెంగల్రాయరెడ్డిగా ప్రసిద్ధి గాంచి జన్మభూమి ఋణం తీర్చుకున్నాడు. ▪️ప్రజాపక్ష నేతగా....రైతు పక్షపాతిగా విద్యార్థి దశ నుండి విప్లవోద్యమ నాయకుడుగా ఎదిగాడు..న్యాయశాస్త్రంలో పట్టా పొందిన తరువాత రాజకీయ శక్తిగా అవతరిస్తూ...మైసూర్ రాచరిక రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రజా ప్రభుత్వాన్ని సాధించడమే లక్ష్యంగగా 1930 లో " ప్రజాపక్ష " పేరుతో (పీపుల్స్ పార్టీ) ను స్థాపించారు. రైతుల సమస్యలకు ప్రాముఖ్యత ఇవ్వడంతో ప్రజాపక్ష పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల మద్దతు కూడగట్టుకుని రైతుల పార్టీగా వేళ్లూనుకుపోయింది. ఇట్లా రైతు పక్షపాతిగా కే.సి. రెడ్డి ఎదురులేని ప్రజాబలాన్ని కూడగట్టుకున్నాడు