హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని సోమవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం రాత్రి శామీర్ పేటలోని తన నివాసంలో ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా వారు పాత్రికేయులకు, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. డబ్ల్యూ జే ఐ కృషిని అభినందించారు. డబ్ల్యూ జే ఐ చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పాత్రికేయులకు, పంచాంగం/దైనందిని ఆవిష్కరణ కార్యక్రమంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా , ఉపాధ్యక్షుడు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments 0