|
modi add 1

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ గారు విడుదల చేసిన ప్రతికా ప్రకటన

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు కౌంటర్ ఇచ్చిన ఎన్వీ సుభాష్ తెలంగాణకు ఏం నిధులు ఇచ్చామో చెప్పడానికి బహిరంగ చర్చకు మేము సిద్ధం. దమ్ముంటే... ప్లేస్, టైం చెప్పండి వేల కోట్ల రూపాయల నిధులను ఇస్తున్న బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తే... చూస్తూ ఊరుకోం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తన్ని, తరిమేసినా మీకు సిగ్గు రాకపోవడం విచారకరం. బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల రజాకార్ల సమితి. మీ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. మేడిగడ్డ మునిగిపోయింది. మీ అవినీతికి అంతే లేదు... అందుకే ప్రజాక్షేత్రంలో ముద్దాయిగా నిలబడ్డారు. ఇవాళ కూడా ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా రూ.41000 కోట్లతో 554 రైల్వే స్టేషన్లు, 1500 ఆర్ఓబీ/అండర్ పాస్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా అంకితభావంతో పనిచేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైన నిధులు ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 9 లక్షల 50 వేల కోట్లు కేటాయించింది. దీనిపై మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో అన్ని వివరాలు క్లుప్తంగా ప్రజల ముందుంచారు. అది మీకు గుర్తులేదా..? రూ.1,153 కోట్ల ఖర్చుతో కూడిన ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులకు తన నిబద్ధతకు మించి నిధులు అందించి హైదరాబాద్ పౌరుల సుదీర్ఘ కలను సాకారం చేస్తోంది. ఆదర్శ్ పథకం ద్వారా రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. 15 స్టేషన్ల పునరాభివృద్ధి.. 48 ఆర్ఓబీలు/ అండర్ పాస్ ల నిర్మాణాలు జరిగాయి. రూ. 6,338 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేసింది బీఆర్ ఎస్ కు కనిపించడం లేదా? తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం మంజూరు చేసింది మీకు గుర్తులేదా..? రూ. 1,366 కోట్లతో భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటు మీకు కనపడటం లేదా..? రూ. 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధిచేస్తోంది. కాజీపేటలో రూ. 521 కోట్లతో వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ ను ప్రారంభించిన విషయం మీకు తెలియదా..? రూ.442.03 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని రామగుండంలో 100 మెగావాట్ల అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు మీకు కనపడటం లేదా..? చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో నిధుల విడుదలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఈసారి పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది గతంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని, కలిసి పోటీ చేసిన చరిత్ర ఆ పార్టీలదే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసే... బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి గత ఎన్నికల్లో ఇట్లాంటి ప్రచారం చేసి లబ్ది పొందాలని చూశారు ఈసారి మాత్రం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది మీ కారు సర్విసింగ్ కి కాదు, కంప్లీట్ గా షెడ్డుకి వెళ్ళింది. అటు నుంచి ఇక స్క్రాప్ కే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటిరిగానే 370 ఎంపీ స్థానాలను గెలుస్తుంది. ఎన్డీఏ కూటమి 400 సీట్లు కైవసం చేసుకుంటుంది.

By NYALAKONDA ANIL DESAI | February 26, 2024 | 0 Comments

నా పోలింగ్ బూత్ నా బాధ్యత - మానాల మోహన్ రెడ్డి

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈనెల 25వ తేదీన నిర్వహించే "నా పోలింగ్ నా బాధ్యత" కార్యక్రమంలో, జిల్లా బూత్ లెవెల్ ఏజెంట్ లు అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. 25వ నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ దీపికా దాస్ మున్షు ఆలోచన మేరకు,వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న, నా పోలింగ్ బూత్ నా బాధ్యత,కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే హాజరవుతున్నారని పత్రికా ప్రకటనలో తెలియజేశారు. కావున ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్, 25వ తేదీన హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించే,నా పోలింగ్ నా బాధ్యత కార్యక్రమంలో విధిగా హాజరు కావాలని, 25వ నాడు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని, మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. అదే విధంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ బాధ్యతగా బూత్ ఏజెంట్లను ఏల్బి స్టేడియం కు పంపాలని, అదేవిధంగా పోలింగ్ బాధ్యత కార్యక్రమానికి, బూత్ ఏజెంట్ల కొరకు పాసులు సిద్ధం చేస్తున్న సందర్భంగా, వాటి వివరాలను కాంగ్రెస్ భవన్ కు పంపాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు.

By NYALAKONDA ANIL DESAI | January 23, 2024 | 0 Comments

రామగుండంలో ఎగిరేది బిజెపి జెండానే..

---- *కందుల సంధ్య రాణి..* జనంగొంతు//రామగుండం//అంబటి సతీష్// రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో నాకు మంచి ప్రజా ఆదరణ ఆశీర్వాదం నాకే ఉందని, ఈ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గతంతో పోల్చుకుంటే ఈ సారి రామగుండం నియోజకవర్గం లో యువత, మహిళా ఓట్ల అత్యధికంగా ఉండటం వల్ల, వారందరూ బీజేపీ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షతులై నా విజయానికి పూర్తి సహకారం అందిస్తున్నారని ఆమె జనం గొంతు ప్రతినిధికి తెలియజేశారు.

By NYALAKONDA ANIL DESAI | November 28, 2023 | 0 Comments

మాయమాటలు నమ్మి మోసపోవద్దు

• బి ఆర్ ఎస్ ద్వారానే ప్రజా సంక్షేమం • బి ఆర్ ఎస్ పార్టీలో చేరికల సునామి • కారు జోరుకు బేజారు అవుతున్న హస్తం • పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్, అక్టోబర్ 30 (జనం గొంతు) : కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి ఓటు వేస్తే మోసపోయి గోసపడతామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని నాలుగవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెగడ పరుష రాములు శ్యామల ఆడెపు అంబదాసు లు తిరిగి సొంతగూటికి చేరుకున్నారు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 సంవత్సరాల కాలంలో చేయని అభివృద్ధిని కేవలం 9 సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపారని అన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీలే కాకుండా అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు ఒంటరి మహిళ వృద్ధులు వికలాంగులు వితంతులు బోదకాలు నేత గీత కార్మికుల కు పెన్షన్లు అందించడమే కాకుండా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నిరంతరం విద్యుత్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందని రానున్న రోజులలో తిరిగి కారు గుర్తుపై ఓటు వేసి బి.ఆర్.ఎస్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు గత పాలకులు చేయనటువంటి అభివృద్ధి చేసి చూపమని రానున్న రోజులలో మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని మీ అందరి సహాయ సహకారాలు అందించి తిరిగి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ కౌన్సిలర్లు పారుపల్లి జ్ఞానేశ్వరి గుణపతి కూకట్ల గోపి తిరుపతి గొట్టం లక్ష్మి మాజీ జెడ్పిటిసి ఐల రమేష్ పాల రామారావు కొండ సత్యనారాయణ బండి సంపత్ గౌడ్ సురా శ్యామ్ తిప్పారపు దయాకర్ రాజోజుల శివ పల్ల సురేష్ అపర్ణ చిన్ని నాని వాహీద్ రఫిక్ వేణి శెట్టి రాము లతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు పలువురు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | October 30, 2023 | 0 Comments

కారు దిగి కాంగ్రెస్ లోకి సతీష్ బాబు • విజయ రమణారావు గెలిపే లక్ష్యంగా పనిచేస్తా

సుల్తానాబాద్,అక్టోబర్ 29 (జనం గొంతు) : బిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి పోతున్నట్లు బిఆర్ఎస్ నాయకులు ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీష్ బాబు అన్నారు. ఆదివారం ఎలిగేడు మండలంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేదని గత రెండు పర్యాయాలు దాసరి మనోహర్ రెడ్డి గెలుపు కొరకు తన వంతు కృషి చేశానని, అయినా పార్టీలో గుర్తింపు లేదని ముఖ్యంగా గత ఎన్నికల్లో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కెసిఆర్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎలిగేడు మండల వైస్ ఎంపీపీ బుర్ర వీర స్వామి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు ఆయన తెలిపారు.విజయ రమణారావు అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుంటా అని ఆయన అన్నారు.

By NYALAKONDA ANIL DESAI | October 29, 2023 | 1 Comments

కారు జోరు కాంగ్రెస్ బేజారు

జనం గొంతు// ఓదెల// సతీష్ కుమార్ కారు జోరుకు బేజారు అవుతున్న హస్తం పెద్దపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ ... కాంగ్రెస్ కి రాజీనామా చేసి దాసరి మనోహర్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నాయకులు... ఓదెల మండలకేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ లు బియ్యాల ఐలయ్య, తీగల సదానందం, ముద్దసాని చేరాలు, ఎంబడి పోచాలు,ముద్దసాని రాజయ్య, దిడ్డిగి శంకరయ్య, రాందేని తిరుపతి, రాందేని స్వామి, రాందేని శ్రీనివాస్, రాందేని కొంరయ్య, రాందేని రమేష్, దొంగరి రాకేష్, రాందేని శ్రీనివాస్ లు పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఉప సర్పంచ్ తీర్తాల కుమారస్వామి,కన్వీనర్ కనికిరెడ్డి సతీష్,మాజీ ఎంపీపీ బుద్దె రామస్వామి,గ్రామ శాఖ అధ్యక్షులు పోలోజు రమేష్,రైతు సమితి గ్రామ కో ఆర్డినేటర్ బోడకుంట మహేందర్,మార్కెట్ డైరెక్టర్ బుద్దె కుమారస్వామి, మాజీ డైరెక్టర్ బోడకుంట నరేష్, పెరుక సంఘం అధ్యక్షులు గోపతి ఎల్లయ్య, ఉపాధ్యక్షులు రాందేని స్వామి, మాజీ మండల కో ఆప్షన్ MD సర్వర్ ,ప్రధాన కార్యదర్శి చింతం మోగిలి ,పడాల మల్లయ్య,కనికి రెడ్డి సురేష్,నాగపురి పైడి,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

By NYALAKONDA ANIL DESAI | October 28, 2023 | 0 Comments

తెలంగాణా రాజకీయాల్లో ఏం జరగబోతోంది.

తెలంగాణ లో జరగబోయే ఎన్నికలతో రాజకీయ వర్గాల్లో అనేక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, బిజేపి, కాంగ్రెస్ లు ఎవరికి వారే అదికారం మాదే అనే ఆలోచనలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తిరిగి మరింత అదనంగా జోడించి కొనసాగిస్తాం అంటూ బిఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తుండగా. సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ గా సామాజిక భద్రత అవసరం. వ్యక్తిని బలోపేతం చేస్తే సమాజం ఆర్దికంగా నిలబడుతుందంటూ బిజేపి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అంత నిగూడమైన లోతుల్లోకి వెల్లి అర్థం చేసుకునే మనస్తత్వం సామాన్య ఓటరుకు ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అడుగంటిపోయిన తన ప్రాభవాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనలతో దూకుడు ప్రదర్షిస్తోంది. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణా ఆర్థిక స్తోమత కు మించి హామీలను గుప్పిస్తోంది. పనిలోపనిగా కాంగ్రెస్ కు మొదటినుండి వెన్నుదన్నుగా నిలబడిన క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ కు మాత్రమే పడేలా కార్యాచరణ రూపొందించుకుంటోంది. తద్వారా కర్ణాటక లో మాదిరిగా తెలంగాణ లో కూడా అదికారం అంది పుచ్చుకోవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ అదిష్టానం ఉంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ అదికారం లోకి వచ్చినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అదికారం లోకి రాకపోతే కాంగ్రెస్ పేరుతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది కాంగ్రెస్ నీడన ఉంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాకుండా బిజెపి ని హిందుత్వ పార్టీగా మైనారిటీలకు సూచికగా చూపించి వేసిన ఓట్ల గేలంతో అదికారం అందిపుచ్చుకున్న కాంగ్రెస్ కు తెలంగాణా లో కూడా అదే ఫార్ములా ప్రయోగిస్తే ఇక్కడి సామాజిక వర్గాలు కూడా కాంగ్రెస్ పాచికలో చిక్కుతారా లేక కాంగ్రెస్ కే ఝలక్ ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే బిఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలు సామాన్యులకు మేలు చేకూర్చినప్పటికీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి దౌర్జన్య పూరిత వ్యవహారాల మూలంగా కేసిఆర్ ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ వారి ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహారాల మూలంగా సామాన్య ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది చాలా వరకు కేసిఆర్ అండ్ టీమ్ మీద వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. ఇక బిజెపి విషయానికి వస్తే అదికారం అందుకునే దాకా అని పైకి లేచిన బిజేపి గాలి అంతే వేగంగా కిందికి పడిపోయింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పైకి లేచిన ప్రాభవాన్ని నిలబెట్టుకోవడంలో తెలంగాణ నేతలు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు. అయితే కేంద్ర సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతి రహిత కేంద్ర పాలన. దేశ భద్రత అంశాల్లో గత పాలకులకు కేంద్రం లో అదికారం లొ ఉన్న బిజెపి ప్రభుత్వానికి గల తేడా. సామాన్యుడిని కూడా ఆర్దికంగా తనంతట తానుగా ఆర్దికంగా నిలదొక్కుకునేలా అనుసరిస్తున్న కేంద్ర విదానాలు. హిందుత్వ కార్డు తమను గట్టెక్కిస్తాయని అనుకుంటున్నారు. రేపటి గురించి ఆలోచించి బుర్ర పాడు పాడుచేసుకోవడం ఎందుకు ఈరోజు మాత్రం చాలు అంటూ తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే చూడగలిగే సామాన్య ఓటరుకు ఇవన్నీ అర్దమవుతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో...

By NYALAKONDA ANIL DESAI | October 28, 2023 | 0 Comments

Hot Categories

2
1
6
1