రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయికల్ పట్టణం లో భౌతిక మరియు జీవశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో బొడ్డుపల్లి రక్షిత( భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల) మొదటి స్థానంలో నిలిచింది . ఏ. దీక్షాయిని (రాయికల్ కస్తూర్బా పాఠశాల) ద్వితీయ స్థానంలో నిలిచింది . ఎంపికైన ఇద్దరు విద్యార్థులు ఈనెల 20వ తేదీన జగిత్యాలలో జరిగే జిల్లా స్థాయిపోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సైన్స్ ఉపాధ్యాయులు పొన్నం రమేష్,గాజింగి రాజేశం, కలవకోట కార్తీక్,పద్మ విజయకుమార్, రాజేందర్, రమేష్,రత్నాకర్,ఉమారాణి మండలం లోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
Comments 0