తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా హైకోర్టుని రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం లో 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే ఉన్నతమైన హైకోర్టుగా నిర్మాణం చేయుటకు సంకల్పించి 100 ఎకరాలను కేటాయించిన సందర్భంగా కేవలం హైకోర్టు న్యాయవాదులకు మాత్రమే పూజలో పాల్గొనే అవకాశాన్ని కల్పించి ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్ర చూడ్ భూమి పూజ చేసి తెలంగాణ నూతన హైకోర్టు పవనానికి పునాదిరాయిని వేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన హైకోర్టు భవన నిర్మాణ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాదిగా హాజరైన తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌటుప్పల్ కోర్టు వారో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లైబ్రరీ సెక్రెటరీ గ్రంధాలయ కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ గారు మాట్లాడుతూ ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది భారతదేశ వ్యాప్తంగా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టులోని ప్రముఖమైన న్యాయమూర్తులు అందరూ పాల్గొని భూమి పూజ చేసినటువంటి ప్రదేశాన్ని సందర్శించి ఆ గొప్ప వ్యక్తులందరూ సంకల్పించి భూమి పూజలో పాల్గొన్న కార్యక్రమంలో ఒక హైకోర్టు న్యాయవాదిగా నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు అతి త్వరలోనే నూతన హైకోర్టు భవనం ప్రజలకు అందుబాటులోకి రావాలని అనేక కేసులు అతి త్వరలోనే పరిష్కారం కావాలని అదేవిధంగా న్యాయ వ్యవస్థలో పేరుకుపోయినటువంటి అనేక కేసులు అతి త్వరలో పరిష్కారమై ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని న్యాయవాదులకు దేశవ్యాప్తంగా సరైన గుర్తింపు లభించే విధంగా సంచలమైనటువంటి కేసులను వాదించి తెలంగాణలోని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో హైకోర్టు ద్వారా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ మరియు హైకోర్టు న్యాయవాదులు సుంకర్ జనార్దన్ గౌడ్ ,బండి సురేష్, విజయ ప్రశాంత్, శ్రీశైలం, మల్లేష్ జగదీష్ మహేష్ బాబు అనేకమంది న్యాయవాదులు పాల్గొన్నారు