*మీడియా సమావేశం *భూ కబ్జా విషయం లో అధికారుల నిర్లక్ష్యం.* *రాష్ట్ర మానవ హక్కుల కమిషన్,* *రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ లలో ఫిర్యాదు.* *న్యాయం కోసం బాధిత కుటుంబం పోరాటం.* ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం కు చెందిన మాజీ సర్పంచ్ పాత సత్యం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దళిత కులస్తులలైన వీరికి నాటి ప్రభుత్వం వీరి తండ్రి అయిన పాత రాజయ్య పేర తన జీవిత కాలంలో నాటి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 1989లో ధర్మారం, కొత్తపల్లి గ్రామా పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే.నం.467/1లో 33×40 చదరపు గజాల స్థలాన్ని ప్లాట్. నం. 1గా నిర్ధారిస్తూ రెవెన్యూ పరంగా పట్టా, లొకేషన్ మరియు ఇంటి నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ అనుమతి మంజూరు చేయటం జరిగింది. నాడు అందులో ఇంటి నిర్మాణం చేసుకుని ఉన్నాం. ఈ క్రమంలో మాయొక్క ప్లాట్ ను కబ్జా చేసేందుకు మా ప్లాట్ సమీపంలో ఉన్న గందె మురళిధర్, గందె జగదీశ్వర్ మరియు ఇతరులు నాటి మాజీ నక్సలైట్ అయిన బయ్యపు సమ్మిరెడ్డి ద్వారా 2004 లో మా ఇంటి నిర్మాణం కూల్చివేయించటం జరిగింది. ఈ విషయాన్ని మేము స్థానిక పోలీసులతో పాటు జిల్లా యస్.పి గారికి ఫిర్యాదు చేయడంతో సదరు వ్యక్తులు కబ్జా నుండి వైదొలిగారు. మరల మేము మా ప్లాట్ లో తాత్కాలిక నిర్మాణం చేసుకుని మా కుటుంబ అవసరాలకు వినియోగించు కుంటున్న క్రమంలో సదరు కబ్జా దారుల కుటుంబ సభ్యుడు అయిన ధర్మారం కు చెందిన గందె మధు అను వ్యక్తి మరలా మా ప్లాట్ ను కబ్జా చేసేందుకు తేదీ. 21-12-2023 రోజున అందులోని నిర్మాణాన్ని కూల్చివేసి ప్లాట్ హద్దులను చెరిపి వేయటం జరిగింది. ఇట్టి విషయమై మేము స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిర్లక్ష్యం వహించడం తో మేము తేదీ. 19-2-2024 రోజున జిల్లా కలెక్టర్ గారికి మరియు తేదీ. 22-2-2024 రోజున జిల్లా సి.పి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయిన మా సమస్య పరిష్కారం కాక పోగా సంబంధిత కబ్జా దారుడికే స్థానిక పోలీసులు వత్తాసు పలకడంతో మేము తేదీ. 26-3-2024 రోజున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మరియు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ లలో పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయటం జరిగింది. కాగా ఫిర్యాదును పరిశీలించిన సదరు కమిషన్ వారు మా ఫిర్యాదును విచారణకు స్వీకరించారు. తదనుగుణంగా బాధ్యులపై చర్యలు చేపడతామని తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇకనైనా స్థానిక పోలీసు వారు ఉన్నత స్థాయి కమిషన్ లను మరియు ఉన్నత అధికారులను తప్పు దోవ పట్టించకుండా నిజ నిజాలను పరిశీలించి దళిత కుటుంబానికి చెందిన మాకు ప్రభుత్వ పరంగా కేటాయించబడిన మా ప్లాట్ ను కబ్జా దారుడి నుండి మాకు ఇప్పిస్తూ బాధ్యులపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని మరియు మా కుటుంబ సభ్యులకు ఏలాంటి హాని జరిగిన అందుకు సదరు కబ్జా దారుడు మరియు స్థానిక పోలీసు వారు బాధ్యత వహించాలని లేని యెడల మేము బాధిత కుటుంబ సభ్యులుగా ఆమరణ దీక్షకు పూనుకోవడం జరుగుతుంది అని గౌరవ ప్రదమైన మీడియా ప్రతినిధుల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. *ఈ మీడియా సమావేశంలో..* సామాజిక కార్యకర్త, షేక్ సాబిర్ అలి. మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. *ఇట్లు...* పాత సత్యం, సెల్:9866950232.
Comments 1
పాలక, నాగేశ్వరరావు S/o కృష్ణమూర్తి (late) బిల్లమాడ గ్రామం pp ఇతమానుగుడ పంచాయితీ పులిపుట్టి పోస్ట్ సీతంపేట మండలం కొత్తూరు వయా పార్వతీపురం మన్యం జిల్లా పిన్ 532455
మా బిల్లమాడ రెవిన్యూ గ్రామంలోఆదివాసులం నివాసం ఉంటూ ఇందులో గల భూములు తర తరాలు నుంచి మా సాగు అనుభవంలో ఉంటూ అందులో జీడీ మామిడి టేకు చెట్లు వేసి పలసాయం పొంది జీవిస్తూ ఉండగా తూర్పు గోదావరికి చెందిన వేగ్నేసి వెంకటపతి రాజు మా చెట్లు నరికి దొంగలించి మా భూములు ఆక్రమణ చేయుచూ కంచి వెయ్యుచున్నారు మా ఆదివాసులు సమస్య అధికారులు పటించుకోవటలేదు.