ఎమ్మెల్యే సొంత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ లో చేరారని మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత విమర్శించారు. శనివారం రాయికల్ పట్టణంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి పనుల నిధులు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది.ఆనాడు కల్వకుంట్ల కవితక్క గారు ఇచ్చిన రూ. 25 కోట్ల నిధుల పనులే నేటికీ కొనసాగుతున్నాయి తప్ప ఒక్క పైసా నిధులు తెచ్చి ఎమ్మెల్యే రాయికల్ పట్టణం, మండలం అభివృద్ధి చేయలేదు. మినీ ట్యాంక్ బండ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాటి పనులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వ భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని బిఆర్ఎస్ లో గెలిచి,కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్న. కవితక్క ఇచ్చిన నిధులు తప్ప,ఎమ్మెల్యే సీడిపి నిధులు కేటాయించలేదు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.దానికోసం ఎమ్మెల్యే గారు పార్టీ మారాడని పేర్కొనడం విడ్డురం. రైతు వ్యతిరేకి అని విమర్శించిన రేవంత్ సమక్షంలో ఈ జగిత్యాల పక్షపాతి చేరాడు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైంది? జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారడంతో తులామో, మాసమో తెస్తాడని నియోజకవర్గం ప్రజలు ఎదిరి చూస్తున్నారు. పెన్షన్ లు మేమే ఇచ్చామని చెప్పి ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచి కాంగ్రెస్ కి వెళ్లారు.ఇప్పుడు ఆ అవ్వ, అయ్యలు కూడా పెరిగిన 4000/- పెన్షన్ కోసం ఎదుచూస్తున్నారు మా ఎమ్మెల్యే గారు తెస్తారని. రైతు బంధు ను భరోసా గా మార్చారు.ఇంకా రైతులకు అందలేదు.కూలీలకు అందలేదు. మహాలక్ష్మి పథకంకు అవసరం అయిన నిధులు బడ్జెట్ లో ఊసే లేదు. 2500 ఇస్తామన్న హామీలకు ఆశపడి ఎదిరిచూస్తున్న మహిళా తల్లులకు పార్టీ మారిన ఎమ్మెల్యే ఇప్పిస్తాడా? లేకపోతే చచ్చిన బ్రతికిన అదే పార్టీలో ఉంటానన్న జీవన్ రెడ్డి గారు ఇప్పిస్తాడా అనేది మహిళలకు సమాధానం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిలో తీపిలేని రుచి లాగా ఉంది. కులసంఘాలకు ,చేతి వృత్తులకు ప్రోత్సాహం బడ్జెట్ లో కరువైంది. దళిత బంధు ఊసే లేకపోవడం విచారకరం. ఇందిరమ్మ ఇళ్ళకి పెట్టిన బడ్జెట్ తో ఎవరికీ ఇస్తారు? ఎంతమందికి ఇల్లు ఇస్తారు అనేది సమాధానం ఇవ్వాలి. రుణమాఫీ కి షరతులు విధిస్తూ మాఫీ దక్కకుండా చేస్తున్నారు. అరు గ్యారంటీ లు 13 హామీల్లో ఎన్నింటికి బడ్జెట్ కేటాయింపులు చేశారో, కేటాయించని వాటి అమలు పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు ప్రభుత్వం, ప్రతినిధులు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి శ్రీరామ రక్ష. ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ప్రభుత్వంను నీలదీస్తున్నారు. నమ్మి ఓట్లేస్తే పార్టీ మారి తమ నమ్మకాన్ని వమ్ము చేశాడని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చిన బీఆరెస్ పక్షాన మేమంతా అండగా ఉంటాం. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్,మండల మహిళా అధ్యక్షురాలు రాచమడుగు స్పందన,కౌన్సిలర్లు శ్రీరాముల సువర్ణ సత్య నారాయణ, తురగ శ్రీధర్ రెడ్డి,మరాంపెళ్లి సాయి,మహేష్ గౌడ్,నాయకులు లావుడియా సురేందర్ నాయక్,ఉదయశ్రీ,దొంతి నాగరాజు,గంగాధర్,బర్కం మల్లేష్,చాంద్, హరికృష్ణ,రాజేశం,రాంచంద్రం,వినోద్,శ్రీనివాస్,రాంచంద్రం,బబ్లూ,రాంప్రసాద్,బుఖ్య లక్ష్మి తదితరులు పాల్గోన్నారు..