రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ పట్టణ కేంద్రంలో భీమన్న ఉత్సవాలలో భాగంగా నిర్వహించబడిన సాంస్కృతిక పోటీలలో నృత్యం విభాగంలో రాయికల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు.డాన్స్ విభాగం లో మొదటి బహుమతి సాధించిన విద్యార్థినిలు పెండేల రోషిని, శ్రీలత,స్నేహ,అశ్రిత,పల్లవి, మధురిమ,మాధవిలను ప్రధానోపాధ్యాయులు శ్రీపతి రాఘవులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉధ్యాయములు పొన్నం రమేష్,రవీందర్,మల్లేశం,గంగ జమున,సత్యనారాయణ,జ్యోతి,వనజ,నాగరాజు,శ్రావణ్ కుమార్,సుజాత తదితరులు పాల్గొన్నారు.
Comments 0