విధి నిర్వహణలో ప్రతిభ ఆధారంగా విద్యుత్ ఉద్యోగులకు ఎన్పీడీసీఎల్ సీజీఎం తిరుమలరావు ర్యాంకులు ప్రకటించారు. జగిత్యాల జిల్లా ఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేసే ఏఈ,డిఈ,ఎస్ఈ లకు మే నెలకు సంబంధించి ర్యాంకులు ప్రకటించగా రాయికల్ ఏఈ‌ కె.అర్జున్ తో పాటు సిబ్బంది మొదటి స్థానం దక్కించుకున్నారు. వీరికి జగిత్యాల విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో శనివారం మెమొంటోలు, ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ,డిఈ రాజరెడ్డి,జగిత్యాల రూరల్ ఏడిఈ డి.హరీష్, సెక్షన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.